భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 1938లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం తెలంగాణలోని సిరిసిల్లలో నివసించిన ఆమె, అనంతరం భారతీయ సినీ సంగీత రంగంలో గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
సినిమా
Braking: సంగీత ప్రపంచంలో విషాదం.. తుదిశ్వాస విడిచిన ఎస్.జానకి!
రచన: Venu••2 నిమిషాల పఠనం
భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు.
#cinema#famous#female-singer#-s-janaki#passed-away#heart-attack












