SS.Rajamouli: బాహుబలి సినిమాల నుంచి రాజమౌళి తెలుగు సినిమాకి ఒక బ్రాండ్ అయ్యాడు. భారీ తారాగణంతో సినిమా తీస్తున్నప్పటికీ, ఒక్క రాజమౌళి పేరు మీదే యావత్ ప్రపంచమంతా ఊహించని రీతిలో బిజినెస్ జరుగుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న వారణాసి సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.350 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్టుగా సమాచారం.
ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ అన్నీ భాషల ఓటీటీ రైట్స్ కోసం భారీ మొత్తం ఆఫర్ చేశారట. కానీ, రాజమౌళి అనుకున్నదానికంటే అది చాలా తక్కువ ఆఫర్ అని, ఆయన నిర్మొహమాటంగా హోల్డ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాను దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కార్తికేయ, డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.
మొత్తం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఇంతవరకూ ఈ రేంజ్ బడ్జెట్తో ఏ ఫిల్మ్ మేకర్స్ సినిమాను తీయలేదు. ఈ విషయంలో రాజమౌళి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికే వారణాసి సినిమాపై ప్రపంచ దేశాలలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 120 దేశాలలో 50 భాషలలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. అందుకే, వ్యాపారంలోనూ అసలు తగ్గడం లేదు. ఆయన అనుకున్న రేంజ్ ఫిగర్ వస్తేనే డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఇక, తాజాగా ఈ సినిమా కథాంశం గురించి కూడా రివీల్ చేశాడు రాజమౌళి. ఆయనకి స్వతాహాగా అడ్వంచర్స్ అంటే చాలా ఇష్టమని..అందుకే, వారణాసి చిత్రాన్ని ఓ అడ్వంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకూ టైం ట్రావెల్ లాంటి ఊహించని అంశాలతో రూపొందిస్తున్నట్టుగా రివీల్ చేశాడు. అంతకంతా, అంచనాలు పెంచుతూ వస్తున్న జక్కన్న..ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.












