Ram Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో RC 17 మొదలవ్వాల్సి ఉంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ గతంలోనే వచ్చింది. పూజా కార్యక్రమాలతో త్వరలో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనుండగా, నిర్మాతలలో ఒకరైన రవి శంకర్..ఎంతైనా ఊహించుకోండి..అంతకు మించే ఉంటుంది.. అని హైప్ ఇచ్చాడు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈరోజు అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది అంటే దానికి, ముఖ్య కారణం సుకుమార్, చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా. ఈ సినిమా సక్సెస్తో మైత్రీ వారు మధ్యలో ఫ్లాపులొచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు, ఏకంగా బిగ్ స్టార్స్తో పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు, డిస్ట్రిబ్యూషన్లోకి కుడా వచ్చేశారు. ఒకరకంగా టాలీవుడ్లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలో ముందు ఉంది.
ఇప్పుడు మైత్రీ నుంచి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారు. రవితేజ నటించిన ఇరుముడి సినిమా భారీ హిట్ సాధించిన కారణంగా సక్సెస్ మీట్స్, సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో, భాగంగానే RC 17పై కూడా ఆయన అప్డేట్ ఇచ్చారు. త్వరలో, ఈ సినిమాను ప్రకటించబోతున్నామని, ఫ్యాన్స్ ఎంత ఊహించుకున్నా, అంతకు మించే ఈ సినిమా ఉంటుందని జనాలలో ఆసక్తిని పెంచాడు.
సుకుమా, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఓ బెంచ్ మార్క్ మూవీగా నిలిచింది. ఇప్పుడు, ఇదే కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందంటే, అంచనాలు సహజంగానే తారా స్థాయిలో ఉంటాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ పక్కా స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. పుష్ప ఫ్రాంఛైజీస్తో సుకుమార్ గ్లోబల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్నాడు. కాబట్టి, గ్యారెంటీగా ఈ కాంబో మళ్ళీ ఓ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది.












