National

Priyanka Gandhi: కొత్త విద్యాశాఖ మంత్రిపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. లోక్‌సభలో కలకలం..

రచన: NK5 నిమిషాల పఠనం

Priyanka Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తగా వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి లోక్ సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ గర్భవతిపై లైంగిక దాడి చేసిన వారి విడుదలకు అంగీకారం తెలిపిన వ్యక్తిని ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రిని చేశారు అని ఆమె ఆరోపించారు. ప్రియాంక వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

Priyanka Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తగా వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి లోక్ సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ గర్భవతిపై లైంగిక దాడి చేసిన వారి విడుదలకు అంగీకారం తెలిపిన వ్యక్తిని ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రిని చేశారు అని ఆమె ఆరోపించారు. ప్రియాంక వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఎన్డీయే సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని ప్రియాంకపై ఎదురుదాడికి దిగారు. ప్రహ్లాద్ జోషికి క్షమాపణలు చెప్పాలని ప్రియాంక గాంధీని రిజిజు డిమాండ్ చేశారు. ప్రియాంక వ్యాఖ్యలు "వ్యక్తిత్వ హననం" చేసేలా ఉన్నాయని ఆరోపించిన బీజేపీ, వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా, ప్రియాంక సైతం అంతే ధీటుగా బదులిచ్చారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీజేపీ ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో విద్యాశాఖ మంత్రి బాధ్యతలను మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది కేంద్రం. కాగా, విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు ఆయనను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ విద్యా వ్యవస్థ స్థితిపై కేంద్రాన్ని విమర్శించారు. విద్యా రంగంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం పెరుగుతోందని ఆరోపించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడకాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రహ్లాద్ జోషీని కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమించడం ద్వారా ప్రధాని మోదీ యువతకు తప్పుడు సంకేతాన్ని పంపారని ప్రియాంక గాంధీ వాద్రా ధ్వజమెత్తారు.

"ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీని ఎంపిక చేశారు. అయితే, ఒక గర్భిణిపై అత్యాచారం చేసిన వారి విడుదలకు గతంలో మద్దతు తెలిపిన వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని కోట్లాది మంది బాలికలకు ప్రధాని ఎలాంటి సందేశం ఇచ్చారు?" అని బిల్కిస్ బానో కేసును ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

#Priyanka Gandhi#Pralhad Joshi#Education Minister#Lok Sabha#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి