ప్రపంచం

మాతృత్వాన్ని చాటిన తిమింగలం.. పిల్ల కళేబరంతో 17 రోజులు..1600 కిలోమీటర్లు ప్రయాణం!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

అమ్మ ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు కేవలం మానవాళికే పరిమితం కాదని, సముద్ర గర్భంలో నివసించే మూగ జీవుల్లోనూ అంతర్గతంగా కొలువై ఉంటాయని నిరూపించిన ఒక అరుదైన ఉదంతం ఇది. 2018వ సంవత్సరంలో కెనడా దేశంలోని బ్రిటిష్ కొలంబియా సముద్ర తీర ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ విచారకర సంఘటన.. బిడ్డ ప్రాణాలు కోల్పోయిన బాధలో వేల కిలోమీటర్లు పిల్ల కళేబరంతో ప్రయాణించడం అనేక మంది ప్రకృతి ప్రేమికులతో పాటు శాస్త్రవేత్తల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

 అమ్మ ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు కేవలం మానవాళికే పరిమితం కాదని, సముద్ర గర్భంలో నివసించే మూగ జీవుల్లోనూ అంతర్గతంగా కొలువై ఉంటాయని నిరూపించిన ఒక అరుదైన ఉదంతం ఇది. 2018వ సంవత్సరంలో కెనడా దేశంలోని బ్రిటిష్ కొలంబియా సముద్ర తీర ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ విచారకర సంఘటన.. బిడ్డ ప్రాణాలు కోల్పోయిన బాధలో వేల కిలోమీటర్లు పిల్ల కళేబరంతో ప్రయాణించడం అనేక మంది ప్రకృతి ప్రేమికులతో పాటు శాస్త్రవేత్తల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

 'తాహ్లెక్వా (జే35)' అనే పేరుగల ఒక ఆడ ఓర్కా (కిల్లర్ వేల్) తిమింగలం ప్రసవించిన అరగంట వ్యవధిలోనే దాని బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ల ముందే చనిపోయిన కన్నబిడ్డ కళేబరాన్ని సముద్రంలో వదిలివేసేందుకు ఆ తల్లి తిమింగలం మనసొప్పలేదు. దీంతో ఏకంగా 17 రోజుల పాటు, దాదాపు 1,600 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఆ మృతదేహాన్ని తన తల, ముక్కు భాగాలపై మోస్తూ సముద్ర తరంగాలపై ఈదుకుంటూ వెళ్లింది. మధ్యలో అలల తాకిడికి పిల్ల శరీరం నీటి లోతుల్లోకి మునిగిపోయిన ప్రతిసారీ, తాహ్లెక్వా మళ్లీ లోతులకు మునిగి ఆ కళేబరాన్ని పైకి తీసుకొచ్చేది.

 ఆ తల్లి తిమింగలం ఆవేదనను అంతర్జాతీయ పరిశోధకులు ‘టూర్ ఆఫ్ గ్రీఫ్’ (విషాద యాత్ర)గా అభివర్ణించారు. మృతదేహాన్ని అంత సుదీర్ఘ కాలం మోయడం వల్ల తాహ్లెక్వా తీవ్ర శారీరక ఆయాసానికి, అలసటకు గురైంది. ఆ క్లిష్ట సమయంలో సముద్రంలోని తోటి ఓర్కా తిమింగలాలు సైతం ముందుకు వచ్చి, కొంత సమయం పాటు ఆ మృతదేహాన్ని తమపై మోస్తూ తాహ్లెక్వాకు బాసటగా నిలవడం విశేషం. కేవలం మనుషులలోనే కాకుండా ఓర్కా జీవుల్లో కూడా భావోద్వేగాలను నియంత్రించే ప్రత్యేక హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌మిటర్లు వ్యవస్థీకృతంగా ఉంటాయని, అందుకే అవి మానసిక దుఃఖాన్ని ఇలా వ్యక్తపరుస్తాయని శాస్త్రవేత్తలు అధ్యయనాల ద్వారా స్పష్టం చేశారు.

 తాహ్లెక్వా ప్రాతినిధ్యం వహిస్తున్న 'సదర్న్ రెసిడెంట్ కిల్లర్ వేల్' రకం ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటూ అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది. ఇవి ప్రధానంగా తినే 'చినుక్ సాల్మన్' రకం చేపల లభ్యత గణనీయంగా తగ్గిపోవడం, సముద్ర నీటి కాలుష్యం విపరీతంగా పెరగడం వల్ల ఈ జాతి తిమింగలాల్లో దాదాపు 70 శాతం గర్భధారణలు విఫలమవుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఒక అరుదైన జీవి తన బిడ్డ కోసం పడిన ఈ వేదన పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రపంచానికి మరొకసారి గుర్తుచేసింది.
https://x.com/NaturPictures/status/2078796994450199018?s=20

 

#tahlequah j35#killer whale mother#orca whale news#viral mother whale story#oceanic emotional study#tour of grief orca#marine life study
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి