టాప్ న్యూస్

మా భూమి మీకెందుకు? తిరగబడుతున్న తెలంగాణ?

రచన: Kumar9 నిమిషాల పఠనం

ఇండియాలో భూమి అంటే భక్తికాదు, అదో జీవిత భరోసా.. దాన్నే మింగేసిన నిజాం నుంచి నేటి కాంగ్రెస్ చరిత్ర ఇదే? 1909లో నిజాం రాజు తన భూములు అంటూ చేసిన సర్వేలు, 1925లో రెవెన్యూ పట్టాలుగా మారాయి. గోదావరి, సింగూర్ ప్రాంతాల్లో మాత్రమే పంటలు పండే భూములు పట్టాలుగా ఉండేవి. వాళ్లు మాత్రమే పన్నులు కట్టేవారు. కాని లక్షల ఎకరాల భూమి ఉన్నా, పన్నులు కట్టకుండా నిజాం దేశంలో ప్రజలంతా బతికేస్తున్నారు

- తెలంగాణ భూముల చరిత్ర ఏంటో తెలుసుకోండి?

- ఉద్యమిస్తే కౌలు రైతులకే ఎన్నో చట్టాలు చేశారు

- ఈనాడు సోషల్ మీడియాకు గంటల కొద్దీ చెవులు ఊపే సోమరులైనా?

- భూముల జోలికొస్తే హక్కుల కోసం ఫైట్ చేస్తారు

- ఆనాడు పూట కోసం సాగు రైతుల ఉద్యమం

- ఈనాడు ఈఎంఐల కోసం ఉద్యోగం చేస్తున్న వారి కోసం?

- భూమినే మింగేసిన బీఆర్ఎస్ తెచ్చిన ధరణి వద్దని అనుకుంటే భూమితో పాటు ఇళ్లను సైతం కాజేస్తామన్న కాంగ్రెస్‌ను వదులుతామా?

- భూములను భక్షించాలనే వారికి ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ‘స్వేచ్ఛ న్యూస్’ హెచ్చరిక

- పేదలను కొట్టి పెద్దలకు వేసే భూ పందేరంపై దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఫైటింగ్ ఆగదు

- లేటుగా అర్ధం చేసుకున్నా, భూ వ్యవస్థ చుట్టూ దోచుకుంటున్న తీరుపై ‘స్వేచ్ఛ న్యూస్’ స్పెషల్ రిపోర్ట్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

ఇండియాలో భూమి అంటే భక్తికాదు, అదో జీవిత భరోసా.. దాన్నే మింగేసిన నిజాం నుంచి నేటి కాంగ్రెస్ చరిత్ర ఇదే? 1909లో నిజాం రాజు తన భూములు అంటూ చేసిన సర్వేలు, 1925లో రెవెన్యూ పట్టాలుగా మారాయి. గోదావరి, సింగూర్ ప్రాంతాల్లో మాత్రమే పంటలు పండే భూములు పట్టాలుగా ఉండేవి. వాళ్లు మాత్రమే పన్నులు కట్టేవారు. కాని లక్షల ఎకరాల భూమి ఉన్నా, పన్నులు కట్టకుండా నిజాం దేశంలో ప్రజలంతా బతికేస్తున్నారు అంటూ పట్టాలుగా ఇచ్చేశారు. సర్వే నెంబర్స్ కేటాయించారు. ఆనాడు ఈనాటి టెక్నాలజీ లేదు. ఒక ఎకరం కుటుంబం దున్నుకుంటే ఎక్కువ. కానీ, పన్ను మాత్రం అంతటికి చెల్లించాలనే ఉద్దేశంతో 1935 వరకు ఎవరూ చెల్లించలేదు. దీంతో మాజీ పట్టా అని, ఖరీజు ఖాతా అంటూ మార్చారు. అదే ఏడాది నిజాం రాజు ఏదో సిల్వర్ జూబ్లీలో పదేళ్ల నుంచి రాఖాం కట్టకున్నా వదిలేశారు. ఆ తర్వాత కూడా చెల్లించకపోవడంతో 1940 కాలంలో ఎందుకూ పనికి రాని భూములు అంటూ ఖరీజ్ ఖాతాగా, పొరంబోకుగా, పశువుల కోసం అంటూ కంచె అన్నట్లుగా వర్గీకరించారు. హద్దులు లేని భూమికి బిల్లా దాఖలు అంటూ రెవెన్యూ రికార్డులను తయారు చేశారు. అదే రికార్డులతో ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో ఉండే జమిందారీ వ్యవస్థ, రాయలసీమలో ఉండే రైతువారి పద్దతి అంటూ అన్నీ కలిసిన ఉమ్మడి స్టేట్ కంటే ముందు ఉన్న తెలంగాణ రాష్ట్ర భూములను 1954 నుంచి 1955 ఖాస్రా పహానీ పేరుతో పట్టాలుగా, ఖారీజ్ ఖాతాలుగా పేర్కొన్నారు. అప్పటికే దున్నుకుంటున్న వారికి రక్షిత కౌలుదారుడిగా అంటూ పీటీలుగా తర్వాత చట్టాలు తీసుకొచ్చారు. కేవలం పట్టా, పహాణీ అనే కాలం ఉన్నందునే. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పాడ్డాక లావాణీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సాయుధ పోరాటం, భూ స్వామ్యదారులపై అనేక ఉద్యమాలతో 1972లో అసైన్డ్ భూమిగా మారాయి. ఇందులో చాలావరకు 1935 కంటే ముందు భూములను కలిపేశారు. పైసల పట్టి పెట్టిన కాలంలో కనీసం 10 పైసలు ఎకరాకు చెల్లిస్తే పేదలు సాగు భూమిని కాపాడుకునేవారు. కానీ, 10 పైసలు కూడా లేకుండా ఎంతోమంది జీతగాళ్లలాగా మళ్లీ పట్వారీ కింద పని చేశారు.

అదే భూస్వామ్యం.. ఇప్పుడు సీఎం చేతులమీదగా పేర్లు మార్చి నడిపిస్తున్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జమిందార్ వ్యవస్థలో చాలా భూములను దాచిపెట్టారు. వెయ్యి ఎకరాలు సాగు చేసుకుంటే, వంద ఎకరాలు అంటూ బ్రిటీష్ వారికి తప్పుడుగా పన్ను కట్టేవారు. అలా ఆంధ్రా పాలకుల చేతిలో ఎక్కువగా భూములు పెత్తందారీ చేతిలో ఉండేది. ఇప్పటికీ ఆంధ్రా కంటే తెలంగాణ ఎందుకు రిచ్ రాష్ట్రంగా ఉందో, ఆంధ్రాలో దొంగ లెక్కలతో కొన్ని కులాల వాళ్లే ఎందుకు పాలిస్తున్నారో చరిత్ర అర్ధం చేసుకోవాలి. రాయలసీమలో రైతువారీ, ఇనాం పద్దతి ఉండేది. ఇలా ప్రాంతాల వారీగా చెప్పుకుంటే పోతుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఉండేది. ఇప్పటి రంగారెడ్డిలో పైఘా భూములు 50 వేల ఎకరాలు ఉండేది. ఆనాడే సీఎస్ నెంబర్ 1 నుంచి 14 వరకు కేసులు నడిచాయి.

అక్షరం ముక్క రాని రోజు అంతే.. ఈనాడు సాప్ట్‌వేర్స్ వచ్చినా అంతే?

రోజు కూలి కూలీనే. రైతాంగ ఉద్యమం తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. ఈనాడు ఈఎంఐలు కట్టే లక్షలు సంపాదించే ఇళ్లు కూడా నీది కాదు అంటే, ఏమో నాకు తెలియదు అంటూ రీల్స్, షాట్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో తీన్మార్ చెప్పే కుల జోకులు, నీ ఇంటీరియల్ ఎంత, నా బంగారం ఇంత అని చూపే వాళ్లకు ఈ భూముల గురించి తెలియనన్ని రోజులు ఇలానే ఉంటుంది. అందుకే సాప్ట్‌వేర్స్ కూడా మీ ఇళ్లు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రోజుకి, ఈ రోజుకి మీదేనా కాదా అని తెలుసుకునేలా వ్యవస్థలు మారాయి.

22ఏ చంద్రబాబు పుణ్యమే?

అసైన్డ్ భూములు కూడా అమ్ముకుంటున్నారని 1974లో వాళ్ల భూములను అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాక్ట్ పీవోటీ 1974. కానీ, అదే భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని పబ్లిక్ పాలసీ పేరుతో 1999లో యాక్ట్ ఆఫ్ 4 తో తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేశారు. ఏ భూమినైనా ప్రభుత్వం చిన్న కలెక్టర్ గెజిట్‌తో స్వాధీనం చేసుకోవచ్చని పబ్లిక్ పాలసీని రూపొందించారు. దాన్నే ఈ రేవంత్ రెడ్డి పరోక్షంగా వాడేసి తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాల భూమిని అదనంగా మరో 14 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి నరకం చూపిస్తున్నారు.

అదే.. ఈ చట్టం

కోనేరు రంగారావు కమిటీ, యూఎల్సీ ఎత్తివేత, యాక్ట్ 8 ఆఫ్ 2008, ఆర్ఎస్ఆ , యూఆర్‌యూపీ అప్డేషన్, ఆ తర్వాత ధరణితో వెలమ దొరలు ఎలా భూములు కొల్లగొట్టారు, భూ భారతితో రెడ్డి పటేళ్లు ఏం చేస్తున్నారో తర్వాతి కథనంలో చూద్దాం. శక్తి మేర భూ వ్యవస్థపై పని చేస్తూ రాజకీయ కోణం, ఉద్దేశం లేకుండా పేదల భూముల కోసం నిక్కచ్చిగా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి పని చేస్తూనే ఉంటారు.

#lands#22 A#prohibited list#telangana#darani#bhubarathi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి