సినిమా

Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Rajinikanth: ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే, అది భారీ మల్టీస్టారర్ అవుతుంది. కానీ, ఇది మల్టీస్టారర్ అనుకోవాలా లేక మల్టీ బిగ్ ప్రాజెక్ట్ అనుకోవాలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కారణం ఉలగనాయగన్ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి "ధర్మన్: ది డెడ్లీ డాక్టర్" అనే పేరు పెట్టారు. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి దాదాపు 8 భారీ కెమెరాలను ఉపయోగిస్తున్నారట.

Rajinikanth: ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే, అది భారీ మల్టీస్టారర్ అవుతుంది. కానీ, ఇది మల్టీస్టారర్ అనుకోవాలా లేక మల్టీ బిగ్ ప్రాజెక్ట్ అనుకోవాలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కారణం ఉలగనాయగన్ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి "ధర్మన్: ది డెడ్లీ డాక్టర్" అనే పేరు పెట్టారు. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి దాదాపు 8 భారీ కెమెరాలను ఉపయోగిస్తున్నారట.

అందుకే, ఈ సినిమా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ డేస్ కంటే ముందే పూర్తవుతుందని కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. భారీ చిత్రాలకి కూడా ఒక కెమెరాతోనే షూట్ చేస్తారు. ఒకవేళ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలంటే..రిలీజ్ కి సమయం ఎక్కువ లేదనుకుంటే సెకండ్ యూనిట్ కూడా పనిచేస్తుంది. అయితే, ఇటీవల హీరోలు క్వాల్ షీట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఎక్కువ కెమెరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

"వకీల్ సాబ్" కి 6 కెమెరాలతో షూట్:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌కి ఆయన డేట్స్ 20 నుంచి 22 రోజులు మాత్రమే ఇచ్చారట. అందుకే, కోర్ట్ సీన్స్ అన్నీ కూడా 6 కెమెరాలతో షూట్ చేసినట్టుగా చెప్పారు. ఒకేసారి లైటింగ్ అంతా సెట్ చేసుకొని అన్నీ కెమెరాలను ఆన్ చేసి క్లోజ్, వైడ్, మిడ్ రేంజ్..టాప్ యాంగిల్, ఫుల్ వైడ్, మూవ్‌మెంట్ షాట్స్..ఆడియన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ..ఇలా అన్నీ ఒకేసారి షూట్ చేశారు. దీనివల్ల ఒక్కరోజులోనే ఎంత కాదన్న 3 సీన్లు పూర్తి చేయవచ్చు.

ధర్మన్ కి 8 కెమెరాలు!

కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సినిమా అంటే ఆ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా వేరే లెవల్‌లో ఉంటాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ అంచనాలను ఊహించలేము. కమల్-రజినీ సినిమా విషయంలోనూ అలాంటి ఊహించని అంచనాలే ఉన్నాయి. ఇక, యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ అత్యంత శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పటికే, ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసిన మేకర్స్, దీనిపై క్రేజీ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

ఇక, ఈ సినిమాకి మొత్తం 8 కెమెరాలను వాడుతున్నారట. ఒకేసారి షార్ట్ డివిజన్ చేసుకొని ఒక్క షాట్‌లోనే అన్నీ యాంగిల్స్ కవర్ చేస్తూ చక చకా చిత్రీకరణను మారిముత్తు పూర్తి చేస్తున్నాడట. 4 రోజుల్లో పూర్తవ్వాల్సిన షూట్ రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాడని అందరూ మెచ్చుకుంటున్నారు. దీన్నిబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ధర్మన్ 2027 సంక్రాంతికి బరిలో గ్యారెంటీ అనిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో సిమ్రన్, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విలన్ పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

#Rajinikanth#Kamal Haasan#Dharman#Ashwath Marimuthu#simran#Rasikhanna#Rampothineni
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి