ఏపీ

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ స్జాపనకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యక్ష ఎన్నికల రేసులో కానీ, ముఖ్యమంత్రి పదవి రేసులో కానీ ఉండబోనని తేల్చిచెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ స్జాపనకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో సోమవారం(నేడు) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యక్ష ఎన్నికల రేసులో కానీ, ముఖ్యమంత్రి పదవి రేసులో కానీ ఉండబోనని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తరహాలో తాను కేవలం వెనుక ఉండి పార్టీని నడిపించే ఒక 'మెంటర్' లేదా మార్గదర్శకుడి పాత్రకే పరిమితమవుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

టీడీపీ, వైఎస్సార్సీపీలపై విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కేవలం కొన్ని కుటుంబాల ప్రయోజనాల కోసమే నడుస్తున్న కుటుంబ ఆధారిత పార్టీలని తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి రావడం, ప్రజాధనాన్ని సంపాదించడం తప్ప ఈ పార్టీలకు ప్రజా సంక్షేమం పట్ల ఎలాంటి నిజాయితీ, చిత్తశుద్ధి లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా నడుస్తున్న ఈ రెండు కుటుంబాల ప్రాబల్య రాజకీయాలకు చెక్ పెట్టడమే తమ నూతన రాజకీయ ప్రయాణ ప్రాథమిక లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక న్యాయంపై ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలు మాత్రమే ముఖ్యమంత్రులు కావాలా? మిగతా బహుజన, వెనుకబడిన కులాల్లో సమర్థులైన నాయకులు లేరా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ త్వరలో రాబోయే నూతన పార్టీ ద్వారా అన్ని రకాల వెనుకబడిన, బలహీన వర్గాలకు చెందిన సమర్థులైన బహుజన నాయకులను ప్రోత్సహించి, వారిలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని సాయిరెడ్డి వెల్లడించారు.

సమాజంలో నిజమైన మార్పు కోరుకునే వర్గాలను, యువతను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. తాము ప్రారంభించబోయే నూతన రాజకీయ పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మీడియాముఖంగా తెలిపారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన ప్రకటనలు, ఆరోపణలతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.

#Vijayasaireddy#APPolitics#NewPoliticalParty#VijayawadaNews#APNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి