Toxic: ఒక సినిమా బడ్జెట్ ఎన్నో కుటుంబాలపై ప్రభావితం చూపిస్తుంది. చిన్న సినిమా, తక్కువ బడ్జెట్, మీడియం రేంజ్ హీరోలు..ఇలాంటివన్నీ బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్. కానీ, పాన్ ఇండియన్ సినిమా అని గనక వందల కోట్లు ఖర్చు పెడితే ఎంతో మంది జీవితాలు తారుమారవుతాయి. కానీ, టాక్సిక్ మూవీ విషయంలో మాత్రం కేవలం ఇద్దరే రూ.100 కోట్ల లాసైనా భరిస్తారట.
ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. కియారా అద్వానీ హీరోయిన్గా, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ఇతర కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ, యష్ కలిసి నిర్మించారు.
500 కోట్లకి పైగానే ఈ సినిమాకి బడ్జెట్ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడతో పాటు ఇతర సౌత్ భాషలలో రిలీజైంది. తెలుగులో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని దిల్ రాజు తీసుకున్నారు. అయితే, సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైన తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో, నైజాంలో సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, దిల్ రాజు దగ్గర తీసుకున్న బయ్యర్స్ కి భారీ నష్టాలని ప్రచారం జరిగింది.
కానీ, యష్..వెంకట్లతో దిల్ రాజు ముందుగానే తెలివిగా ఒప్పందం చేసుకున్నాడట. సినిమా లాస్ అయితే, 45 రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేసేలా మాట్లాడుకున్నారట. దిల్ రాజు కూడా అలాగే, 45 రోజుల్లో బయ్యర్స్ కి డబ్బు రిటన్ ఇస్తానని ప్రామిస్ చేశాడట. కాబట్టి, టాక్సిక్ ఫ్లాప్ అవడం వల్ల నష్టాలను మోసేది నిర్మాతలు వెంకట్, యష్ మాత్రమే. మిగతావారంతా సేఫ్. యష్ కి రామాయణ సినిమాలో వాటా ఉంది. అది, హిట్ అయితే లాభాలలో వాటా అందుతుంది. టాక్సిక్ కూడా ఇంతే. కానీ, టాక్సిక్ వల్ల నష్టాలు తప్పవంటున్నారు.












