రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం కత్తులతో దాడులు చేసుకున్న ఘటన ఏపీలో ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలు కొందరు విశాఖపట్నంలో జరిగిన ఓ రేవ్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ మద్యం సేవించి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అమ్మాయిల విషయంలో వారిలోవారికే మనస్పర్దలు వచ్చినట్టు సమాచారం.దీంతో చిన్న వాగ్వాదం నెలకొంది. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకివెళితే.. విశాఖపట్నంలోని ఓ రిసార్ట్లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు TNSF నేతలు హాజరయ్యారు.పార్టీ జరుగుతున్న క్రమంలో అమ్మాయిల కోసం గొడవపడినట్టు సమాచారం. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలుకొట్టుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకట దినేష్ అనే టీడీపీ నాయకుడిని చరణ్ తేజ్ అనే మరో నేత కత్తితో పొడిచినట్టు సమాచారం. దీంతో పార్టీకి వచ్చిన వారంతా భయంతో పరుగులు తీసినట్టు తెలిసింది.
దీంతో తోటి నాయకులు బాధితుడు వెంకట దినేష్ను వెంటనే విమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, రేవ్ పార్టీ నిర్వాహకులు కేసు కాకుండా తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం.
ఇదిలాఉండగా,టీడీపీ యువ నేతలు రేవ్ పార్టీకి హాజరై అమ్మాయిల కోసం కొట్టుకోవడం, కత్తులతో దాడులు చేసుకోవడాన్ని ప్రతిపక్ష వైసీపీ టార్గెట్ చేసింది.రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నలు గుప్పించింది. ఈ విషయంలో యువనేత మంత్రి నారాలోకేశ్ ఏం చర్యలు తీసుకుంటారని అడిగింది.కాగా, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న విషప్రచారంపై టీడీపీ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నట్టు సమాచారం.












