దాంపత్యంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.ఆ సమయంలో విచక్షణ మరిచిపోతున్న కొందరు భార్యబిడ్డలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు అని కూడా చూడటం లేదు. రక్తపుటేర్లు పారిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య, ముగ్గురు కూతుర్లను చంపేసి పరార్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లోని కార్దానీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే..రాహుల్ ఝా తన భార్య గీత, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్లు ఉంటుండగా, కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. అయితే, రాత్రి నిద్రపోయాక భార్య, కుమార్తెలు నందిని(23), రాధిక(18), 14 ఏళ్ల అమ్మాయిని రాహుల్ రాయితో కొట్టి చంపాడు. ఆపై ఉదయాన్నే పాలు తీసుకొచ్చి, టీ తయారు చేసి, తండ్రి లక్ష్మీనాథ్కు ఇచ్చి మెల్లగా ఇంటి నుంచి పరార్ అయ్యాడు.
కోడలు,పిల్లలు కిందకు రాకపోవడంతో ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లి చూడగా వారంతా రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.అనంతరం ఉదయం 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మర్డర్ వెపన్(రాయి) స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రాహుల్ ఝా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ హత్యల వెనుక కచ్ఛితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
https://x.com/pulsenewsbreak/status/2098589411479085142?s=20
ఇదిలాఉండగా, నిందితుడు రాహుల్ అప్పులపాలు అయ్యాడని..మూడు రోజుల క్రితమే పొరుగింటి వారి నుంచి రూ.25 వేల అప్పు తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు ఏ వర్క్ చేయకపోయేవాడని, ఫలితంగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు చెప్పినట్టు తెలుస్తోంది. ఇది కూడా హత్యలకు కారణమని ప్రచారం జరుగుతోంది.












