తెలంగాణ

BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?

రచన: Kumar4 నిమిషాల పఠనం

అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గులాబీ ఎమ్మెల్యేలు వినూత్నంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన'మాక్ అసెంబ్లీ'కి హాజరయ్యారు

అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గులాబీ ఎమ్మెల్యేలు వినూత్నంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన'మాక్ అసెంబ్లీ'కి హాజరయ్యారు. మాజీ మంత్రి,సనత్‌ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా పాత్రలో లీనమయ్యారు. ఉభయసభల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలు, మంత్రుల వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం కల్పిత పాత్రలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కొండా బిడ్డ నన్ను తిట్టింది.. అందుకే తొక్కా..

మాక్ అసెంబ్లీలో సీఎం హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘కొండా సురేఖ బిడ్డ నాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి తొక్కి వచ్చాను. ముఖ్యమంత్రినైన నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను బర్తరఫ్ చేయక ఏం చేయాలి? కేబినెట్‌లో వేరే వాళ్లు కూడా ఉన్నారుగా.. వాళ్ల గురించి కూడా మాట్లాడొచ్చుగా’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.

https://swechaanews.com/swechaa/news/mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said

ఆ తర్వాత బీఆర్ఎస్ మహిళా నేతలను ఉద్దేశించి సీఎం తలసాని మాట్లాడుతూ.. ‘సబితక్క, సునీతక్క అంటే నాకు ఎంతో గౌరవం. మీరు ఇవన్నీ సభలో ప్రశ్నిస్తారని తెలిసే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాను’ అంటూ సెటైరికల్‌గా పంచులు వేశారు.అయితే, అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ, మంత్రులు తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

https://x.com/pulsenewsbreak/status/2098681443446841802?s=20

అధికారపార్టీ నేతలు సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను భయపెట్టలేరని, బాధితుల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ ద్వారా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి ఓ మెసేజ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.

#BRS#mock assembly#politics#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి