ప్రముఖ పాండవానీ జానపద కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయి (70) కన్నుమూశారు. వయోసహజ ఆరోగ్య సమస్యల వల్ల రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. భారతీయ జానపద కళా ప్రపంచంలో ఒక గొప్ప శకం ముగిసిందని పలువురు వ్యాఖ్యానించారు.
తీజన్ బాయి.. మహాభారత కథలను తన అద్భుతమైన గాత్రం, హావభావాలతో ప్రదర్శించి అంతర్జాతీయ వేదికలపై ఛత్తీస్గఢ్ సంస్కృతిని చాటిచెప్పారు. దేశీయ జానపద సంప్రదాయాల రక్షణకు ఆమె ఎంతో కృషి చేశారు. కళారంగానికి ఆమె అందించిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో ఆమెను సత్కరించింది.
తీజన్ బాయి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన కొనియాడారు. ఆమె నిష్క్రమణ జానపద సంగీత రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.












