సినిమా

Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ "అల్లం నీరు"

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mani Ratnam: ఫిదా బ్యూటీ సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. లెజండరీ డైరెక్టర్ మణి రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ ని పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రకటించిన "అల్లం నీరు" (ఇంజివెల్లం-తమిళంలో) టైటిల్ పోస్టర్ చూస్తే, ఇది నిజంగానే వెరైటీ టైటిల్ అని నవ్వుకోవచ్చు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడఖన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Mani Ratnam: ఫిదా బ్యూటీ సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. లెజండరీ డైరెక్టర్ మణి రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ ని పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రకటించిన "అల్లం నీరు" (ఇంజివెల్లం-తమిళంలో) టైటిల్ పోస్టర్ చూస్తే, ఇది నిజంగానే వెరైటీ టైటిల్ అని నవ్వుకోవచ్చు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడఖన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

పొన్నియన్ సెల్వం సిరీస్‌తో మణి రత్నం తన స్టైల్ లో సినిమాలను తీశాడు. భారీ తారాగణం, ఛారిత్రాత్మక చిత్రం అయినా కూడా.. రెండు భాగాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో నటించిన నటీ నటుల మేకోవర్ కోసమే భారీగా ఖర్చు చేశారు. కానీ, కథ ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. నిర్మాతలకి నష్టాల ప్రాజెక్ట్‌గా పొన్నియన్ సెల్వం మిగిలింది. దీని, నుంచి తేరుకొని మణి మళ్ళీ తనకిష్టమైన జానర్ సినిమాను ప్రకటించాడు.

రొమాంటిక్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో మణి రత్నం సిద్ధహస్తుడు. దీనికి, ఉదాహరణ రోజా.. బింబాయి.. సఖి.. వంటి చిత్రాలే. ఈ సినిమాలలోని రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇప్పటికీ హార్ట్ బీట్ పెంచేలా ఉంటాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మణి రత్నం అలాంటి ప్యూర్ రొమాంటిక్ సినిమాను చేస్తున్నాడు. అరవింద స్వామీ, ఆర్.మాధవన్, కమల్ హాసన్, రజినీకాంత్, కార్తీ, త్రిష, విక్రమ్, ఐశ్వర్య రాయ్ లాంటి బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేసిన మణి..ఇప్పుడు మాత్రం ఓ వెరైటీ కాంబోను ఎంచుకున్నాడు.

సాయి పల్లవి-విజయ్ సేతుపతి-"అల్లం-నీరు":

సాయి పల్లవికి కథ బాగా నచ్చితేగానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా అంతే. లేదంటే 96 లాంటి సినిమాను ఒప్పుకోడు. ఇప్పుడు కూడా మణి రత్నం దర్శకత్వంలో చేస్తున్న వెరైటీ కథలో నటించడానికి సాయి పల్లవి-విజయ్ సేతుపతి ఒప్పుకోవడం ఆసక్తికరంగా ఉంది. అసలు, ఏ ఒక్కరు ఈ కాంబినేషన్‌ని ఊహించలేరు. మరి, మణి ఈసారి ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో చూడాలి. తాజాగా, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో కలకత్తా నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి, అల్లం-నీరు కోల్‌కత్తా నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది.

#Mani Ratnam#Sai Pallavi#Vijay Sethupathi#Allam-Neeru#Inji-vellam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి