స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

రెవెన్యూ డెన్ లక్ష్యం రూ.2లక్షల కోట్లు?

రచన: Swechaanews Chairman5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రూ.2లక్షల కోట్ల రెవెన్యూ సాధించడమే లక్ష్యంగా ఒక ముఖ్యనేత ఆ మంత్రికి స్పష్టమైన టార్గెట్ నిర్దేశించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నలుగుతున్న భూవివాదాలు, లిటిగేషన్లను తమకు అనుకూలంగా వాడుకుంటూ రూట్ క్లియర్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

  • ఆ మంత్రికి టార్గెట్ ఇచ్చిన ముఖ్యనేత?

  • హైదరాబాద్ లిటిగేషన్ భూములతో మార్గం సుగమం

  • ఎకరా రూ.200కోట్లు పలికినా.. భూమికి రూ.10కోట్ల ఖర్చు లేదు

  • అడుగుకి రూ.4వేలు దాటని నిర్మాణ వ్యయం

  • దోచుకోవడానికి రేటు కాదు.. క్యాష్ ముఖ్యం అంటున్న మంత్రి టీమ్

  • లక్షల కోట్ల టార్గెట్‌తో అనేక రకాల ప్రయత్నాలు

  • గచ్చిబౌలి అరబిందో, ఖానామెట్ సహా కొండకల్ భూములు అపర్ణకు ఆఫర్?

  • ఖాజాగూడ, రాయదుర్గం వంశీరామ్‌కు.. కూకట్‌పల్లి హానర్ హోమ్స్‌కు..

  • నలుగురి కోసం కాదు.. 40 మంది బడా డెవలపర్లతో భారీ భూ పందేరాలు?

  • గత ప్రభుత్వ భూములను కొల్లగొట్టినట్లే మళ్లీ భారీ స్కెచ్?

  • మరిన్ని సంచలనాత్మక వార్తల కోసం ప్రతిరోజూ 'స్వేచ్ఛ న్యూస్' ఈ-పేపర్ చూడండి

రాష్ట్రంలో రూ.2లక్షల కోట్ల రెవెన్యూ సాధించడమే లక్ష్యంగా ఒక ముఖ్యనేత ఆ మంత్రికి స్పష్టమైన టార్గెట్ నిర్దేశించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నలుగుతున్న భూవివాదాలు, లిటిగేషన్లను తమకు అనుకూలంగా వాడుకుంటూ రూట్ క్లియర్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ.200కోట్లు పలికినా, రియల్ ఎస్టేట్ వర్గాల లెక్కల ప్రకారం దానికి అయ్యే భూసేకరణ, క్లియరెన్స్ ఖర్చు రూ.10కోట్లు కూడా దాటదు. అలాగే నిర్మాణాలు పూర్తి చేయడానికి చదరపు అడుగుకి రూ.4వేలకు మించి వ్యయం కాదు. కానీ, ఈ వ్యాపారంలో అసలు కథంతా రేటులో లేదని, ఎంత భారీగా 'క్యాష్' సమకూరుతోందన్నదే ముఖ్యమని ఆ మంత్రి ప్రధాన అనుచరవర్గం భావిస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకే ఈ దందాను అన్ని మార్గాల్లో విస్తరించి, వేల కోట్ల టార్గెట్‌ను ముద్దాడేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.

 ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా గచ్చిబౌలిలోని అరబిందో, ఖానామెట్‌తో పాటు కొండకల్‌లోని విలువైన భూములను అపర్ణ గ్రూప్‌కు, అలాగే ఖాజాగూడ, రాయదుర్గం ప్రాంతాలను వంశీరామ్ సంస్థలకు, కూకట్‌పల్లిలోని భూములను హానర్ హోమ్స్‌కు పంచిపెట్టే దిశగా వ్యూహం నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఈ నలుగురితోనే ఆగిపోకుండా, దాదాపు 40మంది బడా బిల్డర్లు, డెవలపర్లతో కూడిన ఒక పెద్ద నెట్‌వర్క్‌ను రంగంలోకి దించి భూ పందేరాలకు తెరలేపారని తెలుస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు భూములను ఏ విధంగా అయితే కొల్లగొట్టాయో, సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు కూడా పక్కా స్కెచ్‌తో రెడీ అయ్యారని సమాచారం. ఈ సంచలనాత్మక ఇన్సైడ్ సబ్జెక్ట్, పూర్తి స్థాయి విశ్లేషణల కోసం ప్రతిరోజూ 'స్వేచ్ఛ న్యూస్' ఈ-పేపర్ ఫాలో అవ్వండి.

https://swechaanews.com/epaper

#Telangana Real Estate#Revenue Target#Land Allegations#Hyderabad Real Estate#Political Controversies#Swecha News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి