సినిమా

Sai Pallavi: "తండేల్" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Sai Pallavi: సాయి పల్లవి నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ తెలుగులో రాలేదు. గత ఏడాది(2025) లో వచ్చిన తండేల్ పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించాడు. ఇందులో, సాయి పల్లవి-నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ చెప్పుకున్నారు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన దీని తర్వాత సాయి పల్లవి బాలీవుడ్‌కి వెళ్ళింది. కానీ, తెలుగు సినిమాను ప్రకటించలేదు.

Sai Pallavi: సాయి పల్లవి నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ తెలుగులో రాలేదు. గత ఏడాది(2025) లో వచ్చిన తండేల్ పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించాడు. ఇందులో, సాయి పల్లవి-నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ చెప్పుకున్నారు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన దీని తర్వాత సాయి పల్లవి బాలీవుడ్‌కి వెళ్ళింది. కానీ, తెలుగు సినిమాను ప్రకటించలేదు.

'లెనిన్' మూవీలో సాయి పల్లవిని ఊహించుకున్నారా!

ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా చూసిన వాళ్ళలో సాయి పల్లవి అభిమానులు భాగ్యశ్రీ బోర్సే కంటే ఈ రోల్ సాయి పల్లవి చేస్తే బావుండేదని మాట్లాడుకున్నారట. ఇలాంటి, పాత్రల్లో ఆమె అద్భుతంగా నటిస్తుందని గత చిత్రాలు ఫిదా, తండేల్, విరాటపర్వం లాంటివి పోల్చుకొని చెప్పుకున్నారు. నిజంగానే లెనిన్ మూవీ గనక సాయి పల్లవి చేసి ఉంటే ఇంకో రేంజ్ అని చెప్పొచ్చు.

హిందీలో క్రేజీ ఆఫర్స్:

సాయి పల్లవికి తండేల్ సినిమా చేస్తున్నప్పుడే హిందీలో రెండు భారీ చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. దాంతో, వెంటనే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి..'ఏక్ దిన్' అనే రొమాంటిక్ లవ్ స్టోరీ కాగా, ఇంకోటి ప్రతిష్టాత్మకైన 'రామాయణ' సిరీస్. అయితే, 'ఏక్ దిన్' సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళి పోయింది. సాయి బాలీవుడ్ డెబ్యూ బాగానే డిసప్పాయింట్ చేసింది. ఇక, 'రామాయణ పార్ట్ 1' ఈ ఏడాది దీపావళికి రాబోతోంది. ఇందులో సీతగా కనిపించనుంది.

అయితే, రామాయణ ట్రైలర్ వచ్చాక.. సాయి పల్లవి పాత్రపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. సీతగా ఆమె సూటవలేదన్నారు. కాస్ట్యూంస్ కూడా అంతగా సెట్ కాలేదని వార్తలు ప్రచారం అయ్యాయి. ఏదేమైనా, 'రామాయణ' రిలీజైయ్యాకే ఆమె సీతగా ఎంతవరకూ పర్ఫార్మ్ చేసింది..ఏమేరకు సూటైంది అనే విషయాలను చర్చించవచ్చు. ఇక, తెలుగులో ఆమె కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కానీ, తనకి మాత్రం సరైన కథ వస్తేనే తప్ప..ఏదో సినిమాలో గ్లామర్ కోసం ఉండాలని కదా అంటే అలాంటి సినిమాలను ఒప్పుకోదు. ప్రస్తుతం, తమిళంలో మణిరత్నం సినిమా ఒకటి చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. అలాగే, ధనుష్ నటిస్తున్న 'ఓమ్' సినిమాలో కూడా సాయి పల్లవి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. కానీ, మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ధనుష్-సాయి పల్లవి కలిసి నటించిన 'మారి 2' సూపర్ హిట్ అవగా, ఇందులో ఉన్న 'రౌడీ బేబీ' సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.

#Sai Pallavi#Ek Din#Ramayana#Tandel#Om#Dhanush#Manirathnam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి