తెలంగాణ

Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!

రచన: Venu5 నిమిషాల పఠనం

కాప్రా చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఈ చెరువులో గణేశ్ నిమజ్జానాలకు వెలుసులు బాటు లేదని అన్నారు.. కాబట్టి ఇక్కడ గణపతి నిమజ్జనాలు చేయవద్దని.. చిన్న విగ్రహాల నిమజ్జనానికి చెరువు పక్కనే ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని, పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీకి సూచించారు.

గణేష్ నవరాత్రులు సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో హైడ్రా అలర్ట్ అయింది! వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, నగరంలోని ప్రధాన చెరువులు, తటాకాలపై దృష్టి సారించింది. చెరువుల వద్ద ఆక్రమణలు, వ్యర్థాలు పేరుకుపోకుండా బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతోంది.

అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువుగానీ చెరువులను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో నేడు కాప్రా చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఈ చెరువులో గణేశ్ నిమజ్జానాలకు వెలుసులు బాటు లేదని అన్నారు.. కాబట్టి ఇక్కడ గణపతి నిమజ్జనాలు చేయవద్దని.. చిన్న విగ్రహాల నిమజ్జనానికి చెరువు పక్కనే ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని, పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీకి సూచించారు.

అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో కాప్రా చెరువు ఉన్న కారణంగా ఇక్కడ గణేష్ నిమజ్జనం సరికాదని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్‌గా కాప్రా చెరువును పేర్కొన్న రంగనాథ్.. ఇక్కడ ఉన్న జీవవైవిధ్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అర్బన్ వెట్‌ల్యాండ్స్ జాబితాలో కాప్రా చెరువును కేంద్రం గుర్తించిందని ఆస్ట్రేలియా, యూరప్ సహా ప్రపంచం నలుమూలల నుంచి 470కు పైగా వలస పక్షులకు కాప్రా చెరువు ఆవాసంగా మారిందని పేర్కొన్నారు.

మరోవైపు చెరువుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. 113 ఎకరాల విస్తీర్ణంలో కాప్రా చెరువు అభివృద్ధికి హైడ్రా నడుం బిగించిందని.. వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ లక్ష్యంగా.. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు పనులు చేపడుతున్నట్లు కమిషనర్ రంగనాథ్ వివరించారు.. జీవవైవిధ్యం, పక్షుల ఆవాసాన్ని కాపాడేలా కాప్రా చెరువు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు..

ఇక కాప్రా చెరువులో సుమారు 70 శాతం వరకు ప్రైవేట్ పట్టా భూములు ఉన్నప్పటికీ.. చెరువు అభివృద్ధికి భూ యజమానులు సహకరిస్తుండటాన్ని హైడ్రా కమిషనర్ అభినందించారు. అదేవిధంగా కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంలో.. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు ఆయనను కోరారు.

అనంతరం కాప్రా చెరువుకు వచ్చే వలస పక్షులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన హైడ్రా కమిషనర్.. వెట్‌ల్యాండ్స్ పరిరక్షణ, నిర్వహణ నిబంధనలు–2017 ప్రకారం కాప్రా చెరువు రక్షణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువు హద్దులను ఖరారు చేయడం, ఆక్రమణలను అరికట్టడం, కాలుష్యాన్ని నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. అలాగే గణేష్ నిమజ్జనాల సమయంలో చెరువుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

#Kapra#HYDRAA#Lake development#Ganesh immersions#Commissioner Ranganath#Vinayaka Chavithi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి