Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దులు దాటేసింది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు తన మార్కెట్ను మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఆయన ప్లాన్ చేస్తున్న నెక్స్ట్ సినిమాల లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే ఈ లైనప్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఫుల్ జోష్ ఇస్తున్నప్పటికీ, టాలీవుడ్ దర్శకులను మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఎందుకంటే రాబోయే ఎనిమిదేళ్ల పాటు బన్నీ డైరీ మొత్తం పక్కా ప్లానింగ్తో లాక్ అయిపోయింది.
అసలు మ్యాటర్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ తన తదుపరి నాలుగు చిత్రాలను కూడా పరభాషా దర్శకులతోనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మరో హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికే దాదాపు 2029 వరకు సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఇక ఆ తర్వాత కూడా బన్నీ టాలీవుడ్ వైపు చూసేలా లేరని టాక్. మాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో ఒక భారీ సూపర్ హీరో సినిమాకు బన్నీ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్తో కూడిన ఈ సినిమాకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆ వెంటనే ఒక క్రేజీ బాలీవుడ్ దర్శకుడితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఎనిమిదేళ్ల వరకు ఏ తెలుగు దర్శకుడికి కూడా ఐకాన్ స్టార్ కాల్షీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. గ్లోబల్ స్టార్గా ఎదగాలనే బన్నీ మాస్టర్ ప్లాన్ బాగున్నా, మన టాలీవుడ్ మేకర్స్కు మాత్రం ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.












