NBK 112: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో భారీ మాస్ అండ్ యాక్షన్ సినిమాను మొదలపెట్టబోతున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లోకి హీరోయిన్గా మలయాళ భామ ఎంటరవబోతుందని తాజా సమాచారం. ఆమెవరో కాదు..ఐశ్వర్య లక్ష్మీ. ప్రస్తుతం, ఈ బ్యూటీ సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా, ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ని కూడా వదిలారు. బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న సంగతి క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇక, ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోబోతున్న నేపథ్యంలో నెక్స్ట్ సినిమాను కొరటాలతో చేయనుండగా..ఇదే, నెలలో సెట్స్పైకి తీసుకురానున్నారు. 'దాదా' షూటింగ్ ని ఈ నెలలో పూర్తి చేసి, ఆ తర్వాత వెంటనే కొరటాల సినిమాకి షిఫ్ట్ కాబోతున్నాడు. ఈ లోపే ఇతర తారాగణంపై టాకీ పార్ట్ ను కొరటాల మొదలు పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య సరసన హీరోయిన్ ఎవరైతే సరిగ్గా సరిపోతుందా..! అని మేకర్స్ పలువురు క్రేజీ హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట.
ఈ అన్వేషణలో కొరటాల అండ్ టీమ్ కి బాలయ్య పక్కన ఐశ్వర్య లక్ష్మీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని భావించారట. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సాయి దుర్గ తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు సినిమాను చేస్తోంది. గత ఏడాది రెండు తమిళ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఐశ్వర్య లక్ష్మీ కి తమిళ, మలయాళ భాషల్లో బాగానే క్రేజ్ ఉంది. తెలుగులో సంబరాల ఏటిగట్టు 4వ సినిమా. ఒకవేళ బాలయ్య-కొరటాల శివ సినిమా గనక కన్ఫర్మ్ అయితే, అది 5వ చిత్రం అవుతుంది. మరి, అఫీషియల్గా ఐశ్వర్య లక్ష్మీ ఎన్బికే 112లో ఎంపికైన విషయాన్ని ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి.












