తెలంగాణ

క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది- కూనంనేబి సాంబశివరావు

రచన: NK5 నిమిషాల పఠనం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేబి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై తాతా మధు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యక్తిత్వ హననం చాలా దురదృష్టకరమన్నారు. నిన్నటి ఘటన తనకు బాధ కలిగించిందన్నారు. స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసిందన్నారు కూనంనేని సాంబశివరావు.

Kunamneni: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేబి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై తాతా మధు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యక్తిత్వ హననం చాలా దురదృష్టకరమన్నారు. నిన్నటి ఘటన తనకు బాధ కలిగించిందన్నారు. స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసిందన్నారు కూనంనేని సాంబశివరావు. ఎంత కోపం ఉన్నా అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి వాళ్లు చొక్కా విప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూనంనేని మాట్లాడారు.

తాతా మధుతో బీఆర్ఎస్ క్షమాపణ చెప్పించాల్సిందని కూనంనేని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా మళ్లీ వాళ్లే ఎదురుదాడికి దిగడం దారుణం అన్నారు.

ఆవేశంలో తొందరపడ్డాను, ఆవేశంలో నోరు జారాను నన్ను క్షమించండి అని ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ ను అడిగి ఉంటే ఆయన పెద్దరికం నిలబడేదన్నారు. లేదా పెద్దాయన కేసీఆర్ అయినా.. మా వాళ్లు మాట్లాడింది తప్పు.. స్పీకర్ గారు మన్నించండి అని చెప్పుంటే.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో పాటు శాసనసభ హుందాతనం మరింత పెరిగేదన్నారు. అవేమీ చేయకుండా రివర్స్ లో బీఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగడం అస్సలు బాగోలేదన్నారు. సభ నడవాల్సిన పద్దతుల్లో, సభలో సభ్యులు మాట్లాడే పద్ధతిలో చాలా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూనంనేని నొక్కి చెప్పారు.

మంత్రి శ్రీధర్ బాబు తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాద రావు.. చాలా ఉత్తముడని, ఏనాడు కూడా నోరు జారలేదని కూనంనేని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ హంతకులకు కూడా క్షమాభిక్ష పెట్టాలన్న సంస్కారం ఆయనదని ప్రశంసించారు. కానీ, ఇప్పుడు ఈ బూతుల సంస్కారం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధులకు విషయ పరిజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం అన్నారాయన. పత్రికలు కూడా దిగజారిపోయాయని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికలు అసలు సమస్యలు రాయడం లేదన్నారు. ఎవరు బాగా బూతులు తిడితే వారి గురించే పత్రికలు రాస్తున్నాయన్నారు. అవి చూసి ఇంకా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇది కరెక్ట్ కాదని, పత్రికల తీరు మారాలని కూనంనేని పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో ఎవరూ కూడా సభలో కానీ సభ బయట కానీ స్పీకర్ ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ప్రతిపక్ష నేతను కానీ, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులను బూతులు తిట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు కూనంనేని సాంబశివరావు. స్పీకర్ ను దూషించిన ఘటనలో కచ్చితంగా ఎమ్మెల్సీ తాతా మధుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. శాసనసభ అంటే.. ప్రజల సభ, ప్రజాస్వామ్య దేవాలయం లాంటిది, ప్రజలకు అనేక అంశాలు నేర్పేటటువంటి బడి లాంటిది అనే ఒక పవిత్ర భావన నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు కూనంనేని సాంబశివరావు.

#Kunamneni Sambasiva Rao#Brs#CPI#Telangana Assembly#Speaker Gaddam Prasad Kumar#Tata Madhu#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి