తెలంగాణ

Harish Rao: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్

రచన: NK4 నిమిషాల పఠనం

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు, విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు, విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ బయట హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

''మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి మీద దాడికి ఉసిగొల్పినందుకు కేంద్రాన్ని, గవర్నర్ ను కోరుతున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. రోజూ ఈ రాష్ట్రంలో ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ మర్డర్లు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతోంది. విద్యార్థుల మీద దాడి జరుగుతోంది. ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ నిర్బంధాలు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం మంట కలిసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

''మొన్న పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు పిసికారు, నిన్న సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు కేసీఆర్.. ధర్మరాజు లాంటి కేసీఆర్ ఇంటి మీదకు దాడికి ఉసిగొల్పుతారా?

పోలీసులను, ఎస్కార్టులను ఇచ్చి రోప్ పార్టీని పెట్టి కాంగ్రెస్ గూండాలను, అసెంబ్లీలో ఉండాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇచ్చి కేసీఆర్ ఇంటి మీదకు దాడికి ఉసిగొల్పారు రేవంత్ రెడ్డి. ఇదెక్కడి పద్ధతి? కేసీఆర్ ఇంటి మీదనే దాడికి తెగబడితే ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉన్నారు. వెంటనే సబిత, సునీతకు జరిగిన అవమానానికి సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

#Harish Rao#Brs#Presidents Rule#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి