Manchu Manoj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి 'దాదా'. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ మధ్య 'దాదా' చిత్రంలో మంచు మనోజ్ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మేకర్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనోజ్ కనిపించబోతున్నాడట.
గతంలో మంచు ఫ్యామిలీ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇది మంచు మనోజ్ నటించిన సినిమా. ఈ సినిమా కోసం బాలయ్య రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కేవలం మంచు ఫ్యామిలీపై ఉన్న అభిమానం, వారితో ఉన్న ప్రత్యేకమైన ఇష్టంతో చేశాడు బాలయ్య. అంతేకాదు, డే మొత్తం తన సినిమా షూట్లో ఉండి..కొన్నిసార్లు నైట్ షూట్కి జాయిన్ అయ్యాడు.
అయితే, మంచు మనోజ్ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్గా కనిపించబోతున్నాడు. హీరోగా అవకాశాలు తగ్గిపోయాక ఎవరైనా వేరే బిజినెస్ చేసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. కానీ, మనోజ్ మాత్రం సినిమాలను వదల్లేదు. నిర్మాతలుగా మంచి హిట్ చిత్రాలను తీశారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ప్రొడక్షన్ కూడా చేయడం లేదు. కానీ, బలమైన పాత్రలు వస్తే విలన్ గా నటించడానికి రెడీ అంటున్నాడు మనోజ్.
ఇంతకముందు తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీలో విలన్గా నటించి మెప్పించాడు. ఈ పాత్ర చూసినప్పటి నుంచి మనోజ్ కోసం కొత్తగా రోల్స్ రాయడం మొదలు పెట్టారు. అలా, దాదా కోసం కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ పవర్ ఫుల్ రోల్ మనోజ్ కోసం రాశాడట. క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్గా నిలవనుందట. బాలయ్య సినిమాలో విలన్ పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, 'దాదా'తో మనోజ్ కి మరో మంచి పాత్ర దొరికినట్టే. కాగా, ఈ సినిమాను వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.












