Allu Arjun: టాలీవుడ్ లో ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్గా పుష్ప ఫ్రాంఛైజీస్తో ఐకాన్ స్టార్ మారి, గ్లోబల్ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా రాకా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకుడు అట్లీ కుమార్. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి మన ఐకాన్ స్టార్ అందుకుంటున్న రెమ్యునరేషన్ రూ.300 కోట్లని లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రోజుకి రూ.2 కోట్లు..అంటే అంతా..అని నోరెళ్ళబెట్టారు. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ రెమ్యునరేషన్ 22 నుంచి 25 రోజులకి గాను రూ.150 కోట్లని వార్తలు వస్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లాకైంది. కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్లు అని వార్తలు చూస్తే అసలు ఏ ఒక్కరైనా షాకవకుండా ఉంటారా! అవును..ఆయన నటిస్తున్న రాకా చిత్రానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ అట అది.
పుష్ప పార్ట్ 1కి రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్..పార్ట్ 2కి మాత్రం లాభాలలో వాటా తీసుకున్నాడట. ఆ రకంగా చూసుకుంటే 130 కోట్ల వరకూ బన్నీకి పుష్ప 2 రెమ్యునరేషన్ అందిందట. ఇప్పుడు, రాకా కోసం కూడా ఇదే ఫార్ములాను ఆయన అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం బిజినెస్లో 33 శాతం వాటాకి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే, ఎంత లేదన్నా రూ.300 కోట్లకి పైగానే బన్నీ షేర్ వస్తుందట. ఇది, ప్రభాస్ ప్రస్తుత రెమ్యునరేషన్ కంటే కూడా చాలా ఎక్కువని తెలుస్తోంది.
ఇదే గనక నిజమైతే సౌత్ ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ కొత్త రికార్డ్ నమోదు చేస్తాడు. ఇక, ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. దీపిక పడుకొన్ హీరోయిన్గా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాకా రెండు భాగాలుగా రూపొందుతోందని అంటున్నారు. కానీ, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.












