తెలంగాణ

TG : కొండా సురేఖ మంత్రి పదవీ సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?

రచన: Kumar5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కొండా సురేఖ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆమె మంత్రి పదవీ ఉంటుందా? పోతుందా? అనే దానిమీదే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరేమో ఆమె పదవీ పోవడం ఖామయని అంటుంటే.. మరికొందరు పోదని కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని చర్చ జరుగుతున్నది.

రాష్ట్రంలో కొండా సురేఖ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆమె మంత్రి పదవీ ఉంటుందా? పోతుందా? అనే దానిమీదే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరేమో ఆమె పదవీ పోవడం ఖామయని అంటుంటే.. మరికొందరు పోదని కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని చర్చ జరుగుతున్నది. కొండా సురేఖ తప్పు లేదని.. ఆమె కూతురు చేసిన దానికి తనను శిక్షిస్తే ఏం వస్తుందని కాంగ్రెస్ పార్టీలోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బీసీ లీడర్లు పరోక్షంగా కొండాకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం.

పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డినే నిలబడతారని, ఆయన్ను ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం, దానిపై కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వివాదాస్పదంగా కౌంటర్ ఇవ్వడంతో పార్టీలో రచ్చ మొదలైంది. రేవూరిని పరకాల అభ్యర్థిగా ప్రకటించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు? ఆయన సోదరులతో కలిసి సీఎం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో చిచ్చురాజేసింది.అయితే, కూతురు చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడంతో సొంత పార్టీ నేతలు ఆమెకు ఎదురుతిరిగారు.

పార్టీలోనే ఉంటూ, మంత్రిగా కొనసాగుతూ పార్టీ పరువు పోయేలా, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద తన కూతురు వ్యాఖ్యలు చేస్తే వద్దని చెప్పాల్సింది పోయి.. ఖండించకుండా ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఎలా అంటారని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కమిటీ ఎదుట మంత్రి కొండా హాజరై వివరణ ఇచ్చుకోగా... కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని అధిష్టానానికి కమిటీ నివేదిక పంపించింది.

https://x.com/TeluguScribe/status/2093715246795964798?s=20

దీని ఆధారంగా త్వరలోనే కొండా సురేఖపై చర్యలు ఉంటాయని, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని అంతా భావించారు. సీడబ్ల్యూసీ కీలకనేత కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో ఈ నిర్ణయం వాయిదా పడినట్టు తెలిసింది. అయితే, తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీలకు తెలంగాణ మంత్రివర్గంలో సరైన వాటా దక్కలేదు.

మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను. అలాంటప్పుడు సురేఖను మంత్రి పదవి ఎందుకు తొలగిస్తాము? మరల ఆమె స్థానంలో కొత్తవారికి ఎందుకు చాన్స్ ఇస్తాము?’ అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.దీనిని బట్టి కొండా సురేఖపై ఎటువంటి చర్యలు ఉండబోమని, ఆమె పదవీ గండం గెట్టెక్కినట్టే అని ప్రచారం జరుగుతోంది.

#konda sureka#cm revanth reddy#pcc cheif mahesh goud#telangana#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి