Kollywood: సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో కొత్త తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకుడు రాజా కృష్ణ మేనన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2026-09-03న అఫీషియల్గా ప్రకటించారు. మొదటిసారి పనోరమా స్టూడియోస్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, లోకోమోటివ్ గ్లోబల్ తో కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఇక, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లండన్లో మొదలైంది.
దర్శకుడు రాజా కృష్ణ మేనన్తో హీరోయిన్ త్రిష క్లాప్బోర్డ్ పట్టుకుని ఉన్న ఫోటోను చిత్ర బృందం విడుదల చేస్తూ సినిమా ప్రారంభమైనట్టుగా తెలిపింది. బాలీవుడ్లో ‘ఎయిర్లిఫ్ట్’, ‘షెఫ్’, ‘పిప్పా’ సినిమాలతో బాగా పాపులర్ అయిన దర్శకుడు రాజా కృష్ణ మేనన్, మొదటిసారి తమిళంలో మహిళా ప్రాధాన్యం ఉన్న కథను తెరకెక్కిస్తున్నాడు. ఇక, సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్, హారర్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.

త్రిషతో పాటు మరో ఇద్దరు:
కాగా, ఈ సినిమాలో త్రిషతో పాటు సీనియర్ నటి రాధికా శరత్కుమార్, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర కథ పూర్తిగా మహిళల చుట్టూ తిరుగుతుందని, ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో పాత్రల ఎమోషన్స్, మానసిక సంఘర్షణలు కథను ముందుకు తీసుకెళతాయని చిత్రబృందం తెలిపింది. “ఇది మహిళా పాత్రల బలాన్ని, మిస్టరీని, సైకలాజికల్ టెన్షన్ను కలిపిన ప్రత్యేకమైన కథ” అని మేకర్స్ పోస్ట్లో రాసుకొచ్చారు.
"విశ్వంభర" కోసం వెయిటింగ్:
తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత త్రిష కృష్ణన్ నటించిన విశ్వంభర ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా! అని ఎదురుచూస్తోంది. త్రిషకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే, దాదాపు అందరు స్టార్ హీరోల సరసన, బడా నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసింది. అందుకే, విశ్వంభర గనక హిట్ సాధిస్తే.. ఇక్కడ మళ్ళీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆశగా ఎదురుచూస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.










