మెఘా, గ్రీన్ కో, సన్పెట్రోకి అడవిని రాసిచ్చేసిన ప్రభుత్వం
నక్సల్ ఫ్రీ అని డీజీపీ జెండా ఎగరవేయడానికి కారణాలు ఇవేనా ?
రూ.85వేల కోట్ల పెట్టుబడులతో.. వెయ్యి హెక్టార్ల అడవి వారిదైపోతుందా ?
తుపాకులు మోగిన చోట, కాంతుల పేరుతో ఫారెస్ట్ ని ఖతం చేసే కుట్ర..
రైజింగ్ స్టేట్ లో ప్రకృతి పై పగ ఎంటో పార్ట్ -6
స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ..
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ న్యూస్ చైర్మన్,
9848070809
దావోస్ లోనే దారదత్తం చేశారు.?
ములుగు జిల్లా వెంకటాపురం -వాజేడు సరిహద్దుల కర్రె గుట్టలో MEIL, Greenko కి దారులు తెరుచుకున్నాయి. సోలార్ , స్టోరేజీ పేరుతో ఒప్పందాలు చేసుకుని అక్కడ తిష్టవేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కర్రె గుట్టలు అంటే ఒట్టి ఖాళీ కొండలు కాదు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు, 60 కిలోమీటర్ల పొడవు. 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు, 20 గుట్టలు, జలపాతాలు , గుహలు, ఇరుకు లోయలు, డోలి గుట్ట తెలంగాణలోనే అత్యంత ఎత్తైనా పాయింట్లలో ఒక్కటి. సముద్రానికి 980 మీటర్ల ఎత్తు ఉంటుంది. గోదావరి పరివాహాక ప్రాంతం వీటన్నింటిని ఇన్నాళ్లు మావోయిస్టలు వాళ్ల తుపాకులతో కాపాడారు. మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గా ప్రకటనల ఎప్పుడైనా వస్తుందనే ఆశతో 2025లో లెక్కలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం Sun Petrochemicals తో రూ.45వేల కోట్ల పెట్టుబడులు నాగర్ కర్నూల్లో ఇచ్చారు. Greenko రూ.24వేల కోట్ల ఇప్పగూడెం, వెంకటాపురంలో పెట్టుబడులు, MEIL రూ.11వేల కోట్లు (2,160 MW PSP) ఇవన్ని ఇక్కడ వేల ఎకరాల్లో సోలార్ విద్యుత్తో పాటు స్టోరేజ్ పంపులు పెట్టి పకృతిని నాశనం చేసేందుకు సిద్ధమయ్యారు. 2025 మే ఆపరేషన్ కగార్, బ్లాక్ ఫారెస్ట్ అంటూ 31మంది మావోయిస్టులను మట్టుపెట్టారు పోలీసులు. వందల IEDలు బయటకు తీశారు. వందల మంది సరెండర్ల కావడంతో 2026లో ప్రాంతాన్ని నక్సల్-ఫ్రీగా ప్రకటించారు.
ఇప్పుడు పర్యాటకం పేరుతో పకృతి పై పగ పెట్టుకున్నారు.
ఎంతో ప్రాముఖ్యత అయినా ఈ అడవుల్లో రోడ్డు, క్యాంపు, పర్యాటకం పేరుతో పంప్డ్ స్టోరేజ్ , సోలార్ ప్రాజెక్టులతో పంచుక తినేందుకు సిద్ధమయ్యారు. ఏడు కుటుంబాలు ఉన్న పామునూర్ క్యాంప్ వద్ద గుత్తి కోయ తెగకు చెందిన ఏడు కుటుంబాలు ఉన్నాయి. వీరు 2005 తర్వాత ఛత్తీస్గఢ్ సల్వా జుడుమ్–మావోయిస్టు హింస నుంచి పారిపోయి ఇక్కడ అడవుల్లో స్థిరపడిన అంతర్గత వలస తెగ. దీని బూచిగా చూపించే ఇన్నాళ్లు మరిన్ని తెగల పై పోలీసులు ఇరుచకపడ్డారు. ఎఫ్ ఆర్ ఏ క్లియరెన్స్ ఎంటని ప్రశ్నిస్తున్నారు. పోడు రైతులు, గ్రామ సభ తీర్మానాలు ఏంటో ఇంకా తెల్చలేదు.
సోలార్ పేరుతో ఇప్పటికే Sun Petrochemicals 3 PSPలు + 5,440 MW సోలార్ కోసం నాగుర్కర్నూల్, మంచిర్యాల మండలంలోని ములుగు గ్రామంలో రూ.45,500కోట్లకు దావోస్లో జనవరి 2025లో 2025 MoU చేసుకున్నారు. Greenko Energies వారికి 3,960 MW సోలార్/IREP (పాత PSP ప్రతిపాదన) ఇప్పగూడెం, వెంకటాపురం, ములుగు రూ.24,000కోట్లు పెట్టుబడులు. Dec 2025 Summit MoU లో ఉంది. MEIL కోసం 2,160 MW Pumped Storage కి కూడా ఇక్కడే ఇస్తున్నారని సమాచారం. రూ.11,000 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం. Davos Jan 2025 MoU తర్వాత అటవీ భూములు మళ్లింపు, EIA, గ్రామసభ ఒత్తిడి మొదలవుతుంది. దీంతో అడవికి ప్రమాదం ఏర్పాడే అవకాశం ఉంది. 2020లోనే కర్రెగుట్టల పై గ్రీన్ కో కన్నేసింది. 3,960 MW off-stream closed loop PSP దీనికి గోదావరి నుంచి ఒకసారి 1.65 TMC నిల్వలు ఉండే రెండు రిజర్వాయర్లు కోసం మొత్తం 906 హెక్టార్లు అవసరమని ప్రతిపాదించారు. దీనికి Forest (Conservation) Act కింద క్లియరెన్స్ తప్పనిసరి , 10 కి.మీ.లో వన్యప్రాణి ప్రభావ అధ్యయనం కావాలి . 2,239 ఎకరాల అడవి డైవర్షన్ కి PARIVESH / FCA ఫైల్ నంబర్ ఏమిటి ? కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ భూమి ఎక్కడ ? గ్రామసభ సమ్మతి ఉందా ? FRA క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయా? ఇప్పటి వరకు ప్రజల ముందు ఈ సామాధాలు ఉంచలేదు.
మెగా కి ఇచ్చేది ఎక్కడ ? చట్టాలు ఏం చెప్పుతున్నాయి.
MEIL కోసం 2,160 MW PSPకి ఏ జిల్లా, ఏ రిజర్వ్ ఫారెస్ట్ అనేది MoUలో లేదు. కర్రెగుట్టల బెల్ట్తో కలిపి చూస్తే ప్రజల్లో అనుమానం సహజం. స్పష్టం చేయాల్సింది ప్రభుత్వమే. MEILకు కాళేశ్వరం, లిఫ్ట్ ఇరిగేషన్ చరిత్ర ఉంది. అటవీ భూమి మళ్లింపు అనుభవం ఉంది. అందుకే స్థలం ఎక్కడో దాచిపెట్టి వ్యవహారం చేస్తున్నారు. కర్రెగుట్టలు కేవలం “సీనిక్ హిల్స్” మాత్రమే కావు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆదివాసీ ప్రాంతం. Forest Rights Act, 2006 వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కులు గుర్తించకుండా భూమి మళ్లించరాదు. PESA, 1996 ఏజెన్సీ ప్రాంతంలో భూమి, ఖనిజం, నీటిపై గ్రామసభ తీర్మానం తప్పని సరి . Van (Sanrakshan Evam Samvardhan) Adhiniyam, 1980 ప్రకారం 906 హెక్టార్లు అయితే కేంద్ర అనుమతి తప్పనిసరి. EIA Notification, 2006 PSP + రిజర్వాయర్ అయితే పబ్లిక్ హియరింగ్ పెట్టాల్సిందే. Fifth Schedule గిరిజన భూమి బదలాయింపుపై ప్రత్యేక రక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు రోడ్డు, క్యాంపు, ఆ తర్వాత పర్యాటకం గ్రీన్ ఎనర్జీ పేరుతో గ్రీన్ కారిడార్ తెరవడం అడివిని మార్కెట్లో పెట్టడం జరుగుతుంది.
గ్రీన్ కో గ్రీన్ గ్రాబింగ్ ఎలా ఉంటుందో మరో కథనంలో చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిధుల్లో క్విడ్ ప్రో కో జరిగిందని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది. ఓనర్ అనిల్ పేరు చార్జీషీట్లో పెట్టకుండా ఎలాంటి లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు దావోస్ లో గీ MoU ల ఇన్వెస్టిగేషన్ కథనం రైజింగ్ స్టేట్ లో గ్రీన్ కో గ్రాబింగ్ పార్ట్ -7 గా చూద్దాం.












