జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమేని రమేష్ కొడుకు సంజూష్ చేసిన కారు యాక్సిడెంట్లో మృతి చెందిన భారతి ముఖి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కారు వేగంగా నడిపి ఓ యువతి మరణానికి కారణమైన నిందితుడికి ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. అతని పెట్టిన కేసులు కూడా కఠినమైనవి కావని, బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే పెట్టారని..నిందితుడిని రేవంత్ సర్కార్ కాపాడుతోందని ఇటీవల కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే.
మృతురాలు లైఫ్ స్టైల్ బట్టల షాపులో పనిచేస్తూ కుటుంబానికి డబ్బులు పంపించేదని, కూతురి పంపించే డబ్బుల పైనే వారి కుటుంబం నడుస్తోందని సమాచారం.కూతురి మరణంతో జీవనం కష్టంగా మారినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లగా ఆర్థిక సాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చినట్టు తెలిసింది.దీంతో భారతిముఖి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.
ఇదిలాఉండగా,మాదాపూర్ వద్ద లైఫ్స్టైల్ బట్టల షాపులో పనిచేస్తున్న భారతిముఖి రోడ్డు దాటుతున్న క్రమంలో తన ‘ఆస్టిన్ మార్టిన్’కారును వేగంగా నడుపుతూ వచ్చిన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ ఆమె ఢీకొట్టాడు.వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జరిగి 20 రోజులకు పైనే అవుతున్నా మృతురాలి కుటుంబానికి న్యాయం దొరకలేదు. కనీసం ఆర్థిక సహాయం కూడా అందకపోవడంతో కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
https://x.com/pulsenewsbreak/status/2096483781985341675?s=20
ఏకైక జీవనాధారం కోల్పోయిన భారతి కుటుంబానికి వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నేరస్థుడు శిక్ష లేకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే మృతురాలి కుటుంబం జీవనాధారం కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కన్నా ఎన్డీఏ నాయకుల బంధువులను కాపాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.బీఆర్ఎస్ తరఫున త్వరలోనే భారతి కుటుంబాన్ని సంప్రదించి ఆదుకుంటామంటూ కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.












