స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?

రచన: Swechaanews Chairman14 నిమిషాల పఠనం

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి 1000 రోజులు పూర్తి అవుతుంది. ఆయన పాలనలో ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యం. కానీ, అంతకంటే ఎక్కువగా విమర్శల పాలయ్యారు. మొండి పట్టుదలతో, విజన్ లీడరింగ్‌తో డీఎన్ఏలో వచ్చే నాయకత్వ లక్షణాలతో చదరంగంలో రాజులా కాకుండా ముఖ్యమైన హోం శాఖ, మున్సిపాలిటీతో పాటు మరెన్నో శాఖలు తన వద్ద పెట్టుకుని మంత్రిగా పాలనలో రూపురేఖలు తీసుకొచ్చారు.

  • ఘనంగా చెప్పుడు.. తుస్సుగా పేలుడు?

  • మారిన ప్రభుత్వంలో ఏలిన వెయ్యి రోజుల్లో చెప్పింది ఏంటి.. చేసింది ఏంటి?

  • ప్రజలు పిచ్చోళ్లు అనుకున్నారా?

  • కాంప్రమైజ్ రాజకీయాలు ఎక్కడెక్కడ జరిగాయి?

  • ఇన్నాళ్లలో లాబీయింగ్, లాభపడ్డ తీరుపై స్వేచ్ఛ న్యూస్ పాలి‘ట్రిక్స్’ కథనాలు

  • సంతోశ్‌పై ఆరోపణలు చేసిన వారంతా ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • క్విడ్ ప్రో కో అంటూ ఫార్ములా రేసు కేసులో గ్రీన్ కో ఓనర్‌ను ఎందుకు వదిలేశారు?

  • ఎన్నో ఆధారాలు ఉన్నా హరీశ్ రావుని పోటీగా ఒట్టిగానే వదిలేశారా?

  • ధరణితో కొల్లగొట్టిన వారి పేర్లను ఇంకా ఎందుకు వెల్లడించలేదు?

  • కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ను ఇరికిద్దాం అనుకుని ఎందుకు వెనక్కి తగ్గారు?

  • పేలని బాంబులతో పొటీ పడ్డ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో మేమే గొప్ప అని చెప్పుకుంటున్న ప్రభుత్వ తీరు ఇదే

  • స్వేచ్ఛ న్యూస్ పార్ట్ -1 కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్చ న్యూస్ చైర్మన్

ప్రజా పాలన.. రైజింగ్ మంత్రం

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి 1000 రోజులు పూర్తి అవుతుంది. ఆయన పాలనలో ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యం. కానీ, అంతకంటే ఎక్కువగా విమర్శల పాలయ్యారు. మొండి పట్టుదలతో, విజన్ లీడరింగ్‌తో డీఎన్ఏలో వచ్చే నాయకత్వ లక్షణాలతో చదరంగంలో రాజులా కాకుండా ముఖ్యమైన హోం శాఖ, మున్సిపాలిటీతో పాటు మరెన్నో శాఖలు తన వద్ద పెట్టుకుని మంత్రిగా పాలనలో రూపురేఖలు తీసుకొచ్చారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందిచారని చెప్పుకుంటున్నారు.

చెప్పింది ఎంటి.. చేసింది ఏంటో స్వేచ్ఛ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల స్టైల్ రిపోర్టింగ్

పాయింట్ నెంబర్ 1

ఆదాయ లెక్కలు జిల్లాల వారీగా.. కులాల వారీగా చూస్తే..

2025 - 26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం. ఇది ఏ జిల్లాలో ఎంతో, ఏ కులానికి ఎంతో చెప్పగలరా? మీ కుటుంబ ఆదాయం, బినామీ ఆదాయం కూడా, కూలీ పని చేసే వాడితో కలిపితే ఎలా? ఈనాటికి తలసరి అదాయం 5 వేలు కూడా లేని కుటుంబాల లెక్కలు ఉన్నాయి. పాలనలో ఏం జరిగిందో, జరగాలో చెప్పడానికి నేను సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా?

పాయింట్ నెంబర్ 2

రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ

రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశారు. 25 లక్షల రైతులకు మాత్రమే. బీఆర్ఎస్ కంటే చాలా మేలు చేసిన పథకం. కానీ, కౌలు రైతు గురించి చెప్పారు పట్టించుకోలేదు. ఏడాది రెన్యూవల్ కోసం, ఇంటింటికీ నోటీసులు ఇస్తున్నారు. అది కూడా చూసుకోవాలిగా.

పాయింట్ నెంబర్ 3

భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం?

ఒకే విడుతలో 9 రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్లు జమ చేశారు. కానీ ప్రభుత్వంలో ఉండే మంత్రి పొంగులేటి కంపెనీ అకౌంట్స్ కి ఎంత జమ చేశారో చెప్పాలి. ఆ పెట్టుబడి సహాయం ఎందుకు ఈ రోజు వరకు పూర్తిగా ప్రతి సీజన్స్ కి రెగ్యులర్‌గా ఇవ్వడం లేదు. ఇలా లెక్కిస్తే మీరు చేసే సహాయం కంటే బాకీ ఎంతో అని మేము లెక్కలు ఇస్తాం.

పాయింట్ నెంబర్ 4

బోనస్‌తో బోగస్.. నిజమేనా?

సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ సరిగ్గా అమలు ఎప్పుడు చేశారు. మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు ఉంటుందని గ్యారెంటీ ఇస్తారా? ఈ రోజు మార్కెట్ లో వండ్ల ధర ఎంత ఉందో మీకు తెలుసా? మీరు టెండర్స్ లో వడ్లను సిండికేట్లలో ఎంత తక్కువ ధరకు అమ్ముకున్నారో సివిల్ సప్లై వాళ్లని అడిగి తెలుసుకోండి సీఎం గారు.

పాయింట్ నెంబర్ 5

రైతులకు భరోసా ఏది?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన ఉచిత విద్యుత్ నడుస్తోంది. రైతు బీమా ఈ ఏడాది ఇంకా రెన్యూవల్ కాలేదు. పంట నష్టపరిహారంతో రైతులకు భరోసా ఏనాడు రైతులు లబ్ది పొందలేదు. సబ్సిడీ అంటున్న రూ.1.68 లక్షల కోట్లు నేరుగా రైతుకు రాలేదు. అంతా కమీషన్స్. కానీ, సబ్సిడ్ అంటూ ఎంతో కొంత చిన్న కారు రైతులు సంతృప్తి చెందారు.

ఉత్పత్తిలో నెంబర్ 1

వరిలో గత ఏడాది పంజాబ్‌ను అధిగమించాం. ఈ ఏడాది చూపించండి సర్. యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 13.37 లక్షల రైతులకు రూ.18,929 కోట్ల చెల్లించారు. ఆ ధాన్యం కరువులో పనికోస్తుంది కాపాడండి. అమ్ముకుని సిండికేట్ వ్యాపారురులైన శ్రీనివాసులుకు అమ్ముకోకండి.

సోలార్ పథకం తప్పుదారి పట్టిందని తెలుసా?

ఇందిరా సౌర వికాసం కింద 2.10 లక్షల గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తూ 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీటి లక్ష్యంతో రూ.12,600 కోట్ల కార్యక్రమం చేపట్టారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తారా? స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.

నదీ జలాల వాటాలో నష్టమే.. మీకంత సబెక్ట్ లేదు?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. తుమ్మిడిహట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత అని చెప్పారు. కానీ, ఏ ఒక్క పని పూర్తి చేయలేదు. రాజ్యానికి రాజుగా మీకు నీటి పారుదలపై మరో 30 శాతం నాలెడ్జీ అవసరం. అందుకే ఏపీకి లాభం చేసేలా చేస్తున్నారని ఆధారాలతో సహా స్వేచ్ఛ దేవేందర్ రెడ్డి నిరూపిస్తారు. ఎవరు వచ్చినా చర్చకు సిద్ధం.

మహాలక్ష్మి సక్సెస్.. గృహజ్యోతిలో అన్యాయం

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు, దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అని ప్రకటించుకుంటున్నారు. నిజానికి ఈ పథకం ఎప్పుడో పెట్టాల్సింది. ఇంకా వీలైతే మెట్రో స్వాధీనం చేసుకుంటే అక్కడ కూడా పెట్టినా బెటర్ పథకం. గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటున్నారు. 10 కోట్లకుపైగా జీరో బిల్లులు అని చెబుతున్నారు. కానీ, ఇదే పేరుతో పాతబస్తీలో పేరుకుపోయిన బిల్లులు ఉన్నాయి. వాటిని క్లియర్ చేయిస్తారా? దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.

కల్యాణం కాదన్నారు

కల్యాణలక్ష్మి ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం గత ప్రభుత్వ నిర్ణయాలే. మీరు చేసింది ఎమీ లేదు. 4.54 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ చేశారా? మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి ఆదాయ వనరుల కల్పన మంచిదే కానీ వాటిలోని లోపాల సంగతేంటి?

రేషన్ కార్డు మంచిదే, స్మార్ట్ కాదు

19.15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డుల జారీ చేశారు. కొత్త రేషన్‌ కార్డులు, సభ్యుల చేరికల ద్వారా లక్షలాది మందిని అదనంగా ఆహార భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడంతో అవకతవకలు భారీగా జరిగాయి. దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత జరిగింది. కొత్త విధానానికి శ్రీకారం చుట్టినా రోజుకు వేల క్విటల్స్ పక్కదారి పడుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్లు సక్సెస్?

తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఒక్కో అర్హత కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అన్నారు, కానీ ఇంకా పారదర్శకంగా చేయాలి. హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి నిర్ణయం మీ చిత్తశుద్దికి పరీక్ష. కేసీఆర్ ఇళ్లలా చేయకండి.

పింఛన్‌లో మీరు చేసింది ఏమీలేదు

43.01 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లలో డిసెంబర్‌ 2023 నుంచి జూలై 2026 వరకు రూ.30,089 కోట్ల వ్యయం చేశారు. కానీ, మీరు ఎన్నికల హామీలో ఇచ్చినట్లు చేసింది శూన్యం. సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అనేది అభూత కల్పితం.

కులగణన ఇదే.. పంపీణీ అదే?

రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలను కవర్‌ చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి చేశారు. సర్వే ఆధారంగా కులాల వారీ సామాజిక, ఆర్థిక స్థితిగతులు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్రానికి పంపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయించారు. ఇలా మీరు 150 చెప్పుకున్నా ప్రజల ఆలోచన వేరేలా ఉంది. మీ టెండర్స్‌లో అవినీతి, మీరు అనుకునే వారికే ఇచ్చే వ్యవహారం అంతా బట్టబయలు చేస్తాం. అదే విధంగా రాజకీయ నాయకులతో మీ ప్రభుత్వ వైఖరి, గత ప్రభుత్వ పాపలను కూడా క్షమించి డబ్బులకు అంతా నయం అవుతుందనే మీ అనుచరుల లాబీయింగ్‌కు సమాధానం కూడా మీ నుంచి రావాలి. లేదంటే బీఆర్ఎస్‌లో లక్షల కోట్ల స్కాముల్లో వేల కోట్ల రూపాయల లబ్ది కోసం ఏం చేశారో? ఇప్పుడు ఏం చేస్తున్నారో రోజుకో కథనంతో ఇవ్వడానికి స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.

#Congress1000Days#RevanthReddy#TelanganaPolitics#SwechaNewsPolitricks#SwechaNews#DevenderReddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి