తెలంగాణ

Telangana BJP: కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్

రచన: NK5 నిమిషాల పఠనం

Telangana BJP: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్దాల పేరుతో ఈ చార్జ్‌షీట్ ను రిలీజ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయ్యిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

Telangana BJP: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరికీ సంక్షేమం పథకాలు అందుతున్నాయని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే.. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనపై బీజేపీ భగ్గుమంది. వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్దాల పేరుతో ఓ చార్జ్‌షీట్ ను రిలీజ్ చేసింది బీజేపీ. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయ్యిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

22ఏ అక్రమాలపై ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 22ఏపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఉన్నాయా అని ప్రశ్నించారు. ఉద్యోగుల పీఆర్ సీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. జీతాలకే డబ్బులు లేనప్పుడు కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్ట్ ఎలా చేపడుతున్నారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

''కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కేవలం స్కాములు, అవినీతి పాలన తప్ప మరొకటి కనిపించడం లేదు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత వెయ్యి రోజులు నుంచి అనేక అబద్దాలతో, అవినీతిమయమైన పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను గోస పుట్టిస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారు. అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేసి మోసం చేసింది. 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ సర్కార్.. కుంభకోణాలు, అవినీతి పాలనలో కూరుకుపోయింది'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదు దోపిడీ పాలన అని విరుచుకపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజ్యాంగ పరిరక్షణ గురించి నీతులు చెప్పే రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఆ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు మోయడం, అధికారం కోసం ఆరాటపడటమే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వైఖరి అని ఆరోపించారు.

#Telangana BJP#Cm Revanth Reddy#Telangana Govt#Telangana Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి