Nithya Menon: నిత్యా మేనన్..ఈ పేరు చెప్తే గుర్తుకొచ్చేది కొన్ని సినిమాలే అయినా..అవి మాత్రం సూపర్ హిట్ చిత్రాలే. నిత్యా మేనన్ నటిగా మాత్రమే కాకుండా, గాయనిగానూ సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో నటించింది. అలాగే, వెబ్ సిరీస్లలోనూ నటించింది. ఆన్ స్క్రీన్పై ఏ హీరోకి లిప్ లాక్ ఇవ్వకపోయినా..ఓ వెబ్ సిరీస్లో మాత్రం సహ నటితో లిప్ లాక్ ఇచ్చింది.
అప్పట్లో ఇది ఓ హాట్ టాపిక్ అయింది కూడా. ఇక సుమారు 50 చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించింది. నిత్యా మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, రెండు నంది అవార్డులు అందుకుంది. 8 ఏళ్ళకి 'ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఇంగ్లీష్ మూవీలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత 17 ఏళ్ళకే హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. తెలుగులో నితిన్, నాని, విజయ్ దేవరకొండ, నారా రోహిత్, సిద్ధార్థ్, శర్వానంద్, సందీప్ కిషన్, రాఘవ లారెన్స్, ఎన్టిర్, పవన్ కళ్యాణ్ లతో నటించింది.
తెలుగులో నిత్యా మేనన్ నటించిన ఆఖరి సినిమా భీమ్లా నాయక్. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కాంచన సిరీస్లో నిత్యా అంగ వైకల్యం ఉన్నా యువతిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఇప్పుడు మన స్టార్ హీరోయిన్ సమంత మాదిరిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటోంది. గతంలో ఓ సినిమాకి సహ నిర్వాతగా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే, ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ నిర్మాణం జోలికి వెళ్ళలేదు.
మళ్ళీ ఇంతకాలానికి, ఓ కథ నిత్యాకి బాగా నచ్చి నిర్మాతగా సినిమాను మొదలుపెట్టబోతోంది. డీకే దీనికి కథ అందిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో నిత్యా రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకుందట. మరి, సమంతలా నిత్యా కూడా నిర్మాతగా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.










