Kollywood: తెలుగు, తమిళ్లో సూర్య-నాగ్ మల్టీస్టారర్ రూపొందబోతుందా!..ప్రస్తుతం అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మల్టీస్టారర్స్ చేయడానికి నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే, తమిళ స్టార్ హీరో సూర్య కూడా మల్టీస్టారర్ మూవీస్ అంటే ఆసక్తి ఎక్కువే. టాలీవుడ్ స్టార్, కోలీవుడ్ స్టార్ కలిసి రెండు భాషలలో మల్టీస్టారర్ అంటే ఆ క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు కింగ్ నాగార్జున, సూర్య కలిసి ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారట.
ఇప్పటికే, కథ ఇద్దరు హీరోలకి నచ్చిందని సమాచారం. సూర్య తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ని ఓకే చేశాడు. ఈ సినిమాను సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ‘జగరమ్ స్టూడియోస్’ బ్యానర్ లో నిర్మించనున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం, ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ను జరుపుకుంటోంది. ప్రస్తుతం సూర్య తన 47, 48 సినిమాలను చేస్తున్నాడు.
ఇక, సూర్య - హెచ్.వినోద్ కాంబినేషన్లో రుపొందనున్న సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకముందు, నాగార్జున, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ పాత్రకి అక్కడ మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో, ఇప్పుడు సూర్య సినిమాలోనూ ఓ పవర్ ఫుల్ రోల్ చేయమని అడిగినట్టుగా తెలుస్తోంది. నాగ్ కూడా దీనికి ఓకే అన్నాడట.
"ఊపిరి" మూవీలో కలిసి నటించిన నాగ్-కార్తి:
తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఊపిరి సినిమాలో నాగార్జున, సూర్య సోదరుడు కార్తి కలిసి నటించారు. ఫ్రెంచి సూపర్ హిట్ సినిమా "ది ఇన్టచబుల్స్" ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. తమిళంలోనూ ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. నాగార్జున-కార్తిల మధ్య కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ థియేటర్స్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు, నాగ్-సూర్య కాంబో గనక నిజమైతే ఈ మల్టీస్టారర్ గ్యారెంటీగా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. మరి, అధికారికంగా ఈ ప్రాజెక్ట్ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.








