మీరు నందిలా పని చేస్తున్నా..
పది మంది కోసం పం**లా తయారయ్యారని టాక్?
- కేసీఆర్ పది మంది కోసం నందిలా ఆలోచించారని వినికిడి?
- మీ పాలనలో అంతా కాంప్రమైజింగ్ మైండ్ గేమే కదా?
- మాటలేనా.. చేతలు ఎప్పుడైనా చూపించారా?
- నందికి పందికి తేడా అంటే ఇదే గుర్తుకువచ్చింది సీఎం?
- ఫాంహౌస్కే పరిమితం చేశామన్న నేతకే అంత ఖర్చా?
- మీ మంత్రి వర్గం ఖర్చుల లెక్క ఎంతో చెప్పండి చూద్దాం
- ఢిల్లీకి అందరితోపాటు పోతున్నట్లు ఖర్చు తగ్గించే బిల్డప్ ఇస్తే సరిపోతుందా?
- ప్రభుత్వ ముసుగులో ప్రజల సొమ్ము తింటున్న మీకే అంతుంటే..
- ప్రజలుగా మీ రాజభోగాలను చూస్తే మాకెలా అనిపించాలి
- రాజ్యం మీ చేతిలోనే ఉందిగా మాటలెందుకు చేతల్లో చూపించొచ్చుగా?
- చేసిన డ్రామా చాలు పటేలా.. మీ మైండ్ గేమ్ అర్థమైంది అంటున్న సోషల్ మీడియా
- రైజింగ్ పేరుతో చెప్పింది ఎంటి.. చేస్తోంది ఏంటి?.. పార్ట్ -2
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
సవాళ్లతోనే ప్రజలను మభ్యపెడుతూ సీఎం అయిన రేవంత్ రెడ్డి, అధికారంలో వచ్చి 1,000 రోజులు అయినా మేస్త్రీ మాటలతోనే కోటలు కడుతున్నారు. నిత్యం ఏదో ఒక డైవర్ట్ ఇష్యూని వెతుక్కుని రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా మీకు ప్రజలు సర్వ అధికారాలు కట్టబెట్టారు. గత 8 ఏండ్లుగా చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. పైగా అధికారం అడ్డుపెట్టుకుని కాంప్రమైజింగ్తో వేల కోట్లు సంపాదించారని ఆరోపణ. రాష్ట్రంలోని ఎన్నో భూములను మీ గ్యాంగ్ దోపిడీ చేస్తోందని స్వేచ్ఛ న్యూస్ వార్తలు ఇచ్చింది. అదే నిజం. సగం పాలన కంటే ఎక్కువ పూర్తి కాగానే వెయ్యి రోజుల అర్భాటంతో పాటు మీరు చేసిన భూ దందాలు కూడా చెబితే బాగుంటుంది.
నందికి నంది.. పందికి పంది?
మీకు మీరు సొంతంగా నంది అనుకోవచ్చు. కానీ, వ్యవస్థను నడిపేందుకు పం*గా మారుతున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. మీరు చెప్పినట్లు కేసీఆర్ ఏం చేసినా పది మందితో వచ్చేవారు. నందిగా నిర్ణయం తీసుకునేవారు. మీరు నందిగా వచ్చినా పం*లా పని చేస్తున్నారని టాక్. ప్రభుత్వంలో ఉండి అలా ఖర్చుల గురించి మాట్లాడితే మీరు ప్రజల సొమ్ముతో ఎంత ఖర్చు చేస్తున్నారో వివరించాల్సి ఉంటుంది. మీరు చెప్పుకోవడానికి ఢిల్లీకి కామన్ ప్లైట్లో వెళితే సరిపోతుందా?
వెయ్యి రోజుల ప్రజాపాలన
రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి అయితే ఎందుకు స్థితిగతులు చెప్పడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా చెప్పుకున్నారు. అయితే వారికోసం ఏం బడ్జెట్ కేటాయించారు, ఖర్చు లెక్కలు చెప్పగలరా? బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం అంటూ భారీ మోసమే చేశారు. వాళ్లకు చేయాల్సింది ఉన్నా ఏక కాలంలో మోసానికి పాల్పడ్డారు. ఓట్లు కొట్టేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్రం మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయింపులు మాత్రమే చేశారనే ఆరోపణలున్నాయి..
వేతనాలు.. కూలీలు
పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రభుత్వం చేపట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి.. నైపుణ్యం లేని కార్మికులకు రూ.16 వేలు, సెమీ స్కిల్డ్కు రూ.17 వేలు, స్కిల్డ్కు రూ.18,500, హైలీ స్కిల్డ్కు రూ.20 వేల కనీస నెలవారీ వేతనం అన్నారు. కానీ, మీరే స్కూల్లో ల్యాబ్ టీచర్స్ కోసం 16 వేలు అంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలా సాధ్యం అయింది సీఎం గారు.
గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టం చేశారు కానీ ఉద్యోగి భద్రత ఏది? వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురికాకుండా కుటుంబ బాధ్యతను బలోపేతం చేసే ప్రత్యేక చట్టం చేయడం మంచి పనే కాని గుర్తుంచుకోవడం కష్టం. సొంత కొడుకులు పట్టించుకోకుంటే ఎవరేం చేయలేం. ఎన్ని చట్టాలు వచ్చినా నిత్యం నేరాల్లో ఒకటిగా ఉంటుంది. స్కీముల లిస్టులో గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది శూన్యం. వెయ్యి రోజుల పాలనపై పార్టులు పార్టులుగా కథనాలు చూద్దాం. రైజింగ్ స్టేట్లో పంది ఎవరో, నంది ఎవరో ఆధారాలతో తేల్చుదాం...










