Naga Chaithanya: అక్కినేని ఫ్యామిలీ హీరోలు అక్కినేని నాగార్జున, తన తనయుడు నాగ చైతన్యలు నటిస్తున్న సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఆల్రెడీ నాగార్జున నటిస్తున్న 'కింగ్ 100' డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అఫీషియల్గా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు, చైతూ కూడా డిసెంబర్ 4న 'వృష కర్మ' సినిమాతో రాబోతున్నాడు.
డిసెంబర్ 3న ఫౌజీ:
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఫౌజీ..డిసెంబర్ 3న రిలీజ్ చేస్తామని మేకర్స్ డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఓ వార్త ఫౌజీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ నెల నుంచి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపితోంది.
ప్రభాస్ తప్పుకుంటే చైతూ రెడీ:
ఫౌజీ దాదాపుగా వాయిదా పడబోతుందని అంటున్నారు. ఇది, తెలిసే వృష కర్మ మేకర్స్ ఠక్కున ఆ డేట్ ని ఉపయోగించుకోవాలని ఒక్కరోజు వెనక అంటే డిసెంబర్ 4న వృష కర్మ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలని ఫిక్సైయ్యారట. లేదంటే ఫౌజీతో పోటీ ఎందుకు వస్తారని మాట్లాడుకుంటున్నారు. నిజంగా, ఫౌజీ పోస్ట్ పోన్ అయితే చైతూకి సోలో డేట్ దొరుకుంది.
తండేల్ లాంటి భారీ హిట్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తోన్న వృష కర్మ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. మొత్తానికి, డిసెంబర్ నెలలో 20 రోజుల గ్యాప్ లో తండ్రీకొడుకులిద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. చూడాలి, మరి ఎవరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.









