టాప్ న్యూస్

TG : తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?

రచన: Kumar6 నిమిషాల పఠనం

రాష్ట్ర కేబినెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరగగా.. ఆశావహులు జోరుగా లాబీయింగ్ చేశారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజికవర్గం, ఎస్సీ సామాజికవర్గం నుంచి కూడా పలువురు లైన్లో ఉన్నారు.

రాష్ట్ర కేబినెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరగగా.. ఆశావహులు జోరుగా లాబీయింగ్ చేశారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజికవర్గం, ఎస్సీ సామాజికవర్గం నుంచి కూడా పలువురు లైన్లో ఉన్నారు.వీరంతా తమకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ వద్ద జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌లో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చిస్తున్న అధిష్టానం పెద్దలు.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అనంతరం కేబినెట్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం.అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

తెలంగాణ మంత్రి వర్గంలో నలుగురు మంత్రులను తప్పించే యోచనలో సీఎం శిబిరం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చర్చలో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, ఆయన స్థానంలో అడ్లూరి లక్ష్మణ్‌ను స్పీకర్‌గా చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం.

అదేవిధంగా కొండా సురేఖను తప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి సురేఖ వ్యవహారంపై ఆధారాలు ఇచ్చినట్టు సమాచారం. మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానంలో ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన సైతం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

మరోవైపు మంత్రి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా.. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. రామ్మోహన్‌రెడ్డికి చీఫ్‌ విప్‌ పదవి దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. పొన్నం ప్రభాకర్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. అధిష్ఠానం అంగీకరించడం లేదన్న సమాచారం. అయితే, పొన్నం స్థానంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేరును సీఎం శిబిరం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖ అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖకు బదులుగా రెవెన్యూ శాఖ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుండగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాఖ మార్పుపై కూడా కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. రెవెన్యూ శాఖను మార్చితే మున్సిపల్‌ శాఖ ఇవ్వాలని పొంగులేటి పట్టుబడుతున్నట్టు సమాచారం.మొత్తంగా రెవెన్యూ, నీటిపారుదల, పరిశ్రమలు, పురపాలక శాఖల్లో భారీ మార్పులు ఉండొచ్చన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

https://x.com/pulsenewsbreak/status/2094989791758618914?s=20

#telangana cabinet#shuffling#congress#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి