తెలంగాణ

BRS : జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్

రచన: Kumar9 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్ వేదికగా సీఎం రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్ వేదికగా సీఎం రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే..వాళ్లు జేబులు నింపుకునే పనిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ‘దండుపాళ్యం బ్యాచ్’ అని అభివర్ణించారు.

సెప్టెంబర్ 7న నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో యువత పక్షాన తెలంగాణ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ 1000 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది ఏంటంటే.. 1000కి పైచిలుకు అన్నదాతల ఆత్మహత్యలు, సకాలంలో కరెంట్, యూరియా ఇవ్వకపోవడం.. 3 సార్లు రైతుబంధు ఎగ్గొట్టడం.. రుణమాఫీ అరకొరగా చేయడం వల్ల 1000 రోజుల్లోనే 1000కి మంది పైచిలుకు అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. నాడు కేసీఆర్ తెచ్చిన రైతు బీమాను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేసిందన్నారు.

https://x.com/TeluguScribe/status/2095049119182238191?s=20

‘రేవంత్ రెడ్డీ.. మేమంతా రాజీనామా చేయాలని నువ్వు ముచ్చట పడుతున్నావ్ కదా? కోటి 67 లక్షల మంది ఆడబిడ్డల ఖాతాల్లో రూ.1.50 లక్షలు వేసి చూపెట్టు.. మేం రాజీనామా చేసి నీ ముచ్చట తీరుస్తాం’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి పాలనలో ‘అసమర్థత PRO MAX.. అవినీతి ULTRA MAX, అరాచకం IMAX’ అని వివరించారు. పంచభక్ష పరమాన్నాలతో రాష్ట్రాన్ని అప్పజెప్తే కుక్కలు చింపిన విస్తరి చేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని,

కేసీఆర్ కట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కట్టింగ్ తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీకి మూటలు.. ఇక్కడ మంత్రివర్గంలో తన్నులు, కీచులాటలు, ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన ఇది అని సెటైర్లు వేశారు.తమ స్వాతంత్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన సామంతుల పాలన ఇది అని.. జలద్రోహం చేస్తున్న జలగల పాలన ఇది అని ఫైర్ అయ్యారు. అనుముల సోదరుడు, పొంగులేటి అనుయాయులు.. 22A పేరిట భూములు కొల్లగొడుతున్నారని, ఒకనాడు తెలంగాణను రేవంత్ రెడ్డి గురువు తెలంగాణను నిషేధిస్తే.. ఈయనేమో కోటి ఎకరాల మాగాణిని నిషేధించి ఒక్కో ఎకరాకు 30% కమీషన్లు తీసుకుంటున్న అవినీతి అనకొండ పాలన కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ సెక్రటేరియట్ అని.. అలాంటి సెక్రటేరియట్‌లో వేలాది మంది ఉద్యోగులు బయటకు వచ్చి.. హామీలు నిలబెట్టుకుంటావా? చస్తావా? అని బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ది పాలన కాదని, ప్రజా పీడన అన్నారు. ఈ 1000 రోజులు క్రిమినల్ వేస్ట్.. ఈ 1000 రోజులకు ఉన్న విలువ జీరో అని అభివర్ణించారు.అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి.. నాలుగు తలలతో బుస కొడుతున్న అనుముల నాగుపాము పాలన ఈ 1000 రోజుల పాలన అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనికి నేటితో 1000 దినాలు పూర్తయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణపై దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి 1000 రోజులు అయ్యిందని, ఇదొక సర్వభ్రష్ట ప్రభుత్వం.. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఏకైక పాలన కాంగ్రెస్ పాలన అని అన్నారు. 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి.. 1000 రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారని పేర్కొన్నారు.జెన్-జీతో పెట్టుకుంటే మోదీకే ముచ్చెమటలు పట్టాయి.. ఇక రేవంత్ లాంటి కేడీ ఎంత? చాలా ఈజీగా భరతం పట్టే శక్తి జెన్‌జీ ఉంది.. కాబట్టి వాళ్లతో పెట్టుకోకు రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే.. కంటోన్మెంట్‌లో మిలిటరీ స్థావరంపై దాడి చేసి తుపాకులు ఎత్తుకుపోయిన పరిస్థితి నెలకొందన్నారు.

కాంగ్రెస్ పాలనలో తప్ప ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలనలో పోక్సో నిందితులు ముఖ్యమంత్రి చలవ వల్ల 9 రోజుల వరకు కాపాడబడుతున్నారని, బీజేపీ మిత్రుల పిల్లలపై పోక్సో ఆరోపణలు వస్తే.. ముఖ్యమంత్రి కంటికి రెప్పలాగా 9 రోజుల పాటు కాపాడుకుంటారని ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి బంధువుల ఆసుపత్రుల్లోనే షెల్టర్లు తీసుకుంటారని, వేరే పార్టీల ఎంపీల కుమారులు కారుతో గుద్ది చంపినా.. కేసులు పెట్టకుండా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రుల కొడుకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు ఉండవని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కలెక్టర్లను బూతులు తిడితే కేసులు ఉండవని, స్వయంగా సీఎం హింసను ప్రేరేపించినా కేసులు పెట్టడం లేదని.. కానీ.. మాపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని, కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే గడగడ వణికిందన్నారు.మీ నాయకురాలు సోనియా గాంధీ తడబడి, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

‘కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీ నాయకురాలికే లేదు.. నీకుందా రేవంత్ రెడ్డి? సీఎం స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డికి హుందాతనం లేదు.. మర్యాద తెల్వదు. అవధుల్లేని అజ్ఞానం.. అదుపులేని అహంకారం.. నోరు తెరిస్తే బూతు కూతలు, అజ్ఞానపు ఆణిముత్యాలు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ అంటాడు. క్రిస్మస్ కనిపెట్టింది సోనియా గాంధీ అంటాడు. ఒకరోజు హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉందంటాడు. మరొకరోజు సముద్రం ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటాడు.ఇంకొకరోజు దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు తయారవుతున్నాయ్ అంటాడు’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

#BRS#KTR#chargesheet#congress ruling#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి