తెలంగాణ

Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!

రచన: Venu4 నిమిషాల పఠనం

పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈశ్వర్ సాయి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.

తన జీవితంతో ఆడుకున్న ఈశ్వర్ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో గతంలో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం..

అయితే, సకాలంలో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గది తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడారని తెలుస్తుంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం.. మరోవైపు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకుండా నార్సింగి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాధురి రాథోడ్, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా నిందితుడు బయటే తిరుగుతున్నాడని, బాధితురాలికి న్యాయం చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు వాపోతున్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు తక్షణమే స్పందించి, మోసానికి పాల్పడిన ఈశ్వర్ సాయిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మాధురి రాథోడ్ డిమాండ్ చేస్తోంది. కాగా, బాధితురాలు చేసిన ఆరోపణలు, ఈ ఆత్మహత్యాయత్నం ఘటన ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది.

ఇక మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పేర్లు ఆగస్టు నెలలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేములవాడలోని ఓ భవనంలో ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడం, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై మాధురి రాథోడ్ కూడా స్పందించారు.

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వీడియోల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, తన ఫోన్‌లోని వీడియోలను ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఏఐ వీడియోలు రూపొందించి ప్రచారం చేశారని ఆరోపిస్తూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సెప్టెంబర్ 1న పలు కథనాలు వెలువడ్డాయి..

#Telangana#Folk dancer#Eshwar Sai#Madhuri Rathod#controversy#attempts suicide
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి