తెలంగాణ

Congress : మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కింది. ఆయనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలపగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కింది. ఆయనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలపగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో, ఆయన స్థానంలో మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీ ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర పోస్టు పెట్టింది.‘ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే చేత అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ (ఏఐపీసీ) ఛైర్మన్‌గా నియమితులైన మధుయాష్కీకి హృదయపూర్వక అభినందనలు.

ఇది తెలంగాణ కాంగ్రెస్ కుటుంబానికి ఎంతో గర్వకారణం.పార్టీ ఆశయం పట్ల మీ అంకితభావం, నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.మీ దార్శనిక నాయకత్వంలో అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను కాంగ్రెస్ ఉద్యమంతో సమర్థవంతంగా అనుసంధానిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.ఈ కొత్త బాధ్యతలో మీరు అపారమైన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’ అని రాసుకొచ్చింది.

కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మధుయాష్కీ గౌడ్ గతంలో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇంతకాలం ఏ పదవి లేకుండా ఉన్న ఆయనకు కీలక పదవి దక్కింది. దేశంలోని వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెషనల్స్‌ను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించడానికి, వారి సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవడానికి ఈ 'ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్' విభాగం పనిచేయనుంది.

#ex mp maduyashki goud#AIpc#congress#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి