తెలంగాణ

పక్కా ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ ఉసిగొల్పారు - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రచన: NK5 నిమిషాల పఠనం

Cm Revanth: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ముక్త కంఠంతో తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. అసభ్యపదజాలంతో స్పీకర్ ను దూషించిన తాతా మధును వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Cm Revanth: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ముక్త కంఠంతో తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. అసభ్యపదజాలంతో స్పీకర్ ను దూషించిన తాతా మధును వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారమే

తాతా మధు వ్యవహారంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్.. ఇవాళ తెలంగాణకు చీకటి రోజు అని, ఇది 4 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం అని వాపోయారు. సభాపతికి జరిగిన అవమానం.. సభ్య సమాజానికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదు పథకం ప్రకారం జరిగిందే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను నిన్న పిలిపించుకుని స్పీకర్ పై ఉసిగొల్పారని రేవంత్ అన్నారు.

ఇలాంటి భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అలాగే స్పీకర్ ను ఉద్దేశించి అసభ్యకర భాష వాడిన తాతా మధుతో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకేలా ఉందని మంత్రి సీతక్క అసెంబ్లీలో ధ్వజమెత్తారు. స్పీకర్ పై అత్యంత హేయమైన భాష వాడారని మండిపడ్డారు. అసభ్య పదజాలంతో స్పీకర్ పై తాతా మధు వాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. స్పీకర్ ను అవమానించిన సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.

బ్యాడ్ లాంగ్వేజ్ కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్

కేసీఆర్ డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ సభ్యులు ఇలా మాట్లాడారని సీతక్క ఆరోపించారు. బ్యాడ్ లాంగ్వేజ్ కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. దళితులంటేనే బీఆర్ఎస్ కు నచ్చదన్నారు. స్పీకర్ గా దళితుడు ఉండటం కేసీఆర్ కు నచ్చదని.. దళితుడైన స్పీకర్ ను అధ్యక్షా అనాల్సి వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని సీతక్క అన్నారు. గతంలో జగదీశ్వర్ రెడ్డి కూడా స్పీకర్ పై ఇలానే మాట్లాడారని సీతక్క ధ్వజమెత్తారు.

తాతా మధును బర్తరఫ్ చేయాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం ఖండించారు. తాతా మధు వ్యాఖ్యలను బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. స్పీకర్ ను అవమానించడం సమాజానికి, ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా అభివర్ణించారు. స్పీకర్ ను దూషించిన తాతా మధును బర్తరఫ్ చేయాలన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం ఖండించారు. తాతా మధు వ్యాఖ్యలను బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. స్పీకర్ ను అవమానించడం సమాజానికి, ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా అభివర్ణించారు. స్పీకర్ ను దూషించిన తాతా మధును బర్తరఫ్ చేయాలన్నారు.

#Cm Revanth Reddy#Telangana Assembly#Brs Mlc#Tata Madhu#Kcr#Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి