రాజకీయాలు

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

తమిళనాడు రాష్ట్ర సచివాలయంలో ఓ కీలక చారిత్రక పరిణామం ఆవిష్కృతం కాబోతోంది. సుమారు అరవై ఏళ్లుగా ప్రసిద్ధ 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' ప్రాంగణం వేదికగా సాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO) త్వరలోనే 'నమక్కల్ కవిజ్ఞర్ మాళిగై' భవనానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమిళనాడు రాష్ట్ర సచివాలయంలో ఓ కీలక చారిత్రక పరిణామం ఆవిష్కృతం కాబోతోంది. సుమారు అరవై ఏళ్లుగా ప్రసిద్ధ 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' ప్రాంగణం వేదికగా సాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO) త్వరలోనే 'నమక్కల్ కవిజ్ఞర్ మాళిగై' భవనానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాత కార్యాలయంలో జాగా పరిమితంగా ఉండటంతో, సీఎం ఛాంబర్‌ను ఈ భవనంలోని పదో అంతస్తులోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అక్కడ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సచివాలయానికి వచ్చే అధికారుల సంఖ్య, సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. పాత భవనంలో చోటు సరిపోకపోవడంతో నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తును నూతన కార్యాలయానికి అనువుగా ఎంపిక చేశారు. విశాలంగా రూపొందుతున్న ఈ కొత్త ఆఫీసు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి నుంచి అందమైన బంగాళాఖాతం సముద్ర తీరం స్పష్టంగా కనిపిస్తుంది.

సీఎం కార్యాలయ ఏర్పాటు నిమిత్తం ప్రస్తుతం పదో అంతస్తులో కొనసాగుతున్న సమాచార, తమిళ అభివృద్ధి శాఖలతో పాటు హోం, వాణిజ్య పన్నుల శాఖల ఆఫీసులను ఇతర ప్రాంగణాలకు తరలిస్తున్నారు. కాగా, ఈ పది అంతస్తుల సచివాలయ భవనాన్ని 1975వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ప్రారంభించారు. పూర్తిస్థాయి పరిపాలనా సౌలభ్యం, ప్రజా సౌకర్యం కోసమే ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

#Tamil Nadu Secretariat#Tamil Nadu CM Office#Fort St George#Joseph Vijay#Namakkal Kavignar Maaligai#Tamil Nadu Politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి