హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మొబైల్ రిపేర్ కోసం వెళ్తుండగా.. బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.ఆమె వెంట ఉన్న ర్యాపిడో డ్రైవర్కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను సేకరించినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకివెళితే..ఏపీలోని భీమవరానికి చెందిన హేమదుర్గ (26) బంజారాహిల్స్లోని ఓ కార్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె వినియోగిస్తున్న మొబైల్ పాడవడంతో రిపేర్ కోసం అమీర్ పేట వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని బయలు దేరింది. అయితే, అమీర్ పేట శ్రీనగర్ కాలనీ సమీపంలో బిగ్ బజార్ వెనుక గేటు వద్ద ర్యాపిడో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్టు సమాచారం.
దీంతో ర్యాపిడో రైడర్తో పాటు వెనుక కూర్చున్న హేమదుర్గ ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రైడర్కు స్వల్ప గాయాలు అవ్వగా.. ఉద్యోగిని హేమదుర్గకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మొబైల్ రిపేర్ కోసం ఆఫీసులో అనుమతి తీసుకుని వెళ్లిన హేమ దుర్గ ఇంకా రావడం లేదని ఆఫీసు సిబ్బంది ఆరా తీయగా.. ప్రమాదంలో మరణించినట్టు తెలియగానే తోటి ఉద్యోగులు షాక్ లో ఉన్నట్టు తెలిసింది.
గాయాలపాలైన ర్యాపిడో డ్రైవర్ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు.అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హేమదుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. తమ కూతురి మరణవార్త విని హేమదుర్గ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు సమాచారం.










