ప్రేమ, వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కొందరు భర్తలు, అత్తమామలు,పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కడతేరుస్తుంటే.. మరికొందరు తమ కోసం వచ్చిన ప్రియురాలినే అంతం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు గాను ఓ వ్యక్తి ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు.
వివరాల్లోకివెళితే.. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన స్వప్న(40) భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.గతంలో తల్లిదండ్రులతో కలిసి పూజ కోసం బళ్లారికి వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు డ్రైవర్ బసవరాజ్తో పరిచయం ఏర్పడింది.అది కాస్త వివాహేతర బంధానికి దారితీయగా పెళ్లి చేసుకోవాలని బసవరాజ్ను కోరిన స్వప్న కోరింది. అతను ఒప్పుకోకపోవడంతో సీక్రెట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని స్వప్న బెదిరించింది.
తన పరువు పోతుందనే భయంతో ఆమెను చంపాలని బసవరాజ్ ప్లాన్ వేశాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి మే 15న బళ్లారికి రమ్మని స్వప్నను పిలిపించాడు. కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతుందని నమ్మి వెళ్లిన స్వప్నను.. సిద్ధేశ్వర ఆలయం వద్ద చంపేసి ఆమె మృతదేహాన్ని బసవరాజ్ ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఆమె ఫోన్ని చెరువులో పడేసి, బట్టలను తగలబెట్టేశాడు.
మరోవైపు స్వప్న కనిపించకుండా పోవడంతో మే 31న పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.కాల్ డేటా, లొకేషన్ సాయంతో.. బసవరాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా..అసలు విషయం వెలుగుచూసింది. పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేయడం వల్లే స్వప్నను చంపానని బసవరాజ్ విచారణలో నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
https://x.com/pulsenewsbreak/status/2098959600926003656?s=20











