ఏపీ

AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఓ వైపు వర్షాలు లేక పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా శ్రమించి దేశానికి అన్నం పెట్టాలని భావించిన రైతుల కష్టాన్ని ఏనుగులు నీళ్ల పాలు చేశాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈసారి చాలా మేరకు వరి సాగుకు అన్నదాతలు ముందుకు రాలేదు.

ఓ వైపు వర్షాలు లేక పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా శ్రమించి దేశానికి అన్నం పెట్టాలని భావించిన రైతుల కష్టాన్ని ఏనుగులు నీళ్ల పాలు చేశాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈసారి చాలా మేరకు వరి సాగుకు అన్నదాతలు ముందుకు రాలేదు.పంటమార్పిడి విధానం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు అధికారులు అన్నదాతలకు కీలక సూచనలు చేశారు. అయితే, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వరి నాట్లు వేయగా.. అనుకోకుండా ఏనుగుల గుంపు పొలాల్లోకి వచ్చింది.అంతటితో ఆగకుండా నాట్లు మొత్తం తొక్కేశాయి. సుమారు 8 ఏనుగులు పొలాల్లోకి రావడంతో అన్నదాతలు పరుగులు తీశారు. తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గుమడ–కోటిపాం పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది.

అడవి ఏనుగుల గుంపు సంచారం కారణంగా అన్నదాతలు అటుగా వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. వరి నాట్లు వేసిన పొలాల్లోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి తమకు రక్షించాలని వేడుకుంటున్నారు. అసలే వర్షాలు లేక పంటలు పండక ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు ఏనుగుల దాడులతో చేతికొచ్చిన పంట కూడా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2093929766508507395?s=20

ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని, నష్టపరిహారం అందించాలని రైతుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఏనుగులు పొలాల్లొకి వేగంగా దూసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అడవులు నరికివేతకు గురవ్వడం, ఆహారం దొరక్కే ఏనుగులు ఊర్ల మీదకు వస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

#elephants#andrapradesh#crops#farmers#damage#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి