Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆయన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంపై టాలీవుడ్ తో పాటుగా పాన్-ఇండియా స్థాయిలోను భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక మందన్న పాత్రకి సంబందించిన చిత్రీకరణ పూర్తైంది.
ఇంతకముందు విజయ్-రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించి హిట్ పేయిర్గా నిలిచారు. మళ్ళీ, ఇంతకాలానికి వీరి కాంబోలో రణబాలి రూపొందుతోంది. ముఖ్యంగా వీరిద్దరి పెళ్లి తరువాత వస్తోన్న మూవీ కావడంతో అటు అభిమానులలోనూ ఇటు సినీ లవర్స్లోనూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టాక్సీవాలా మూవీతో విజయ్-రాహుల్ మంచి హిట్ అందుకున్నారు. వీరి కాంబోలో కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా రణబాలి.
అయితే, ఈసారి రాహుల్..విజయ్ కోసం పీరియాడికల్ సబ్జెక్ట్ను ఎంచుకున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్తో పాన్ ఇండియా వైడ్గా ఊహించని స్థాయిలో అంచనాలు మొదలైయ్యాయి. 'సింగనమల బొబ్బిలి రణబాలి'గా విజయ్ దేవరకొండ, 'జయమ్మ'గా రష్మిక మందన్న శక్తివంతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక, తాజాగా.. ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసింది రష్మిక. దీనికి సంబందించిన ఫొటోస్తో మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
అయితే, రణబాలి నుంచి రష్మిక లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఇందులో ఆమె గర్భవతిగా కనిపించబోతోంది. మైసా మూవీ షూటింగ్లో నడుముకు గాయం అయిన కారణంగా 6 వారాల పాటు రెస్ట్ తీసుకున్న రష్మిక..రణబాలి విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బ్యాలెన్స్ ఉన్న ఆమె పార్ట్ కోసం డేట్స్ ఇచ్చి పూర్తి చేసింది. ఇక, తాజాగా జయమ్మ పాత్రకి సంబందించిన ఫొటోస్ బయటకు రావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 16న పాన్ ఇండియా స్కేల్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది.









