Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి! అవును ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ని చూస్తుంటే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నిర్మాత పెట్టుబడి పెడితేనే అది తెరపైకి వస్తుంది. ఇదే, సినిమా గనక బాక్సాఫీస్ వద్ద తిరగబడితే ఆ నిర్మాత పరిస్థితి వర్ణనాతీతం. అందుకే, సినిమా జరుగుతున్నన్ని రోజులు నిర్మాత నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోవాల్సిందేనని పూరి చెప్పారు.
బోల్తా పడుతున్న పాన్ ఇండియన్ సినిమా!
ఒక్క సినిమా హిట్ సాధిస్తే ఆ తర్వాత సినిమాకి నిర్మాత ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. మన సీనియర్ నిర్మాతలు బడ్జెట్ కట్రోల్లో ఉండాలని ఎంత చెప్పినా నేటితరం నిర్మాతలు లెక్కచేయడం లేదు. ఫలితంగా ఓవర్ బడ్జెట్ వల్ల సినిమా నష్టాలతో ముగుస్తుంది. దీంతో, ఆ నిర్మాత పరిస్థితి దయనీయంగా మారుతుంది. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు అప్పట్లో ఒక సినిమాకి ఇంతే బడ్జెట్ అంటే అంతలోనే రిలీజ్ అయ్యేది.
ఇప్పుడు, ఆయన తనయుడు స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు కూడా అంతే. దర్శకుడు చెప్పింది బడ్జెట్ కాదు..ఆయన చెప్పిందే బడ్జెట్. అంతలోనే సినిమాను రిలీజ్ చేయ్యాలి. లేదంటే ఆ దర్శకుడిని పక్కన పెట్టేస్తున్నారు. అల్లు అరవింద్ ముందు నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కింగ్ నాగార్జున ఇంకా జాగ్రత్తపరుడు. ఒక సినిమా ప్రారంభం అవ్వాలంటే ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని బడ్జెట్ ఇస్తున్నాడు.
ఇదే అన్నీ రకాలుగా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. కానీ, అప్పట్లో నరసింహుడు, ఆ తర్వాత పౌర్ణమి, పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్, ది రాజాసాబ్..ఇటీవల వచ్చిన టాక్సిక్ లాంటి సినిమాలు నిర్మాత కంట్రోల్లో లేకనే తీవ్ర నష్టాలను చూస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యాక అది పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ అయితే, అందరికంటే ఎక్కువ టెన్షన్ నిర్మాతకే ఉంటోంది. ప్రొడక్షన్లో ఉండగానే అది సేఫ్ ప్రాజెక్టా కాదా అని అర్థమైపోతుంది. అప్పుడే, నిర్మాతకి రాత్రిళ్ళు నిద్ర పట్టదు. నిద్రపోవాలంటే నిద్రమాత్రలు తప్పవు.









