తెలంగాణ

TG : సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్ర రాజకీయాల్లో ‘కొండా సురేఖ’ఎపిసోడ్‌కు నిన్నటితో ఎండ్ కార్డు పడింది. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విధంగానే కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి మీద సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముదిరిన వివాదం.. కొండాను కేబినెట్ నుంచి తప్పించే వరకు వెళ్లింది.

రాష్ట్ర రాజకీయాల్లో ‘కొండా సురేఖ’ఎపిసోడ్‌కు నిన్నటితో ఎండ్ కార్డు పడింది. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విధంగానే కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి మీద సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముదిరిన వివాదం.. కొండాను కేబినెట్ నుంచి తప్పించే వరకు వెళ్లింది. సురేఖను పదవీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాల్లో సీఎం రేవంత్ సక్సెస్ అవ్వగా.. పదవి కాపాడుకునేందుకు సురేఖ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలోనే కొండాను కేబినెట్ నుంచి తప్పిస్తూ లోక్‌భవన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ వచ్చాక పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ .. గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాను కలిసి కొండాను తప్పించడానికి గల కారణాలను వివరించడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు.అనంతరం కొండా సురేఖ సైతం మీడియాతో మాట్లాడారు.సీఎం రేవంత్ మీద సంచలన ఆరోపణలు చేశారు.

కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం సంక్రమించిన అధికారాలతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.కొండా బర్తరఫ్‌ నేపథ్యంలో ఆమె మొన్నటివరకు నిర్వహించిన అటవీ, దేవాదాయ శాఖలను సీఎం రేవంత్‌‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నంబర్ 128ను జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు ఆ శాఖల బాధ్యతలను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నట్టు సమాచారం.

‘కొండా’ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్‌లో మొత్తం మూడు ఖాళీలు ఏర్పడ్డాయి.దీంతో ఆశావహులు మరోసారి లాబీయింగ్‌కు దిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, త్వరలోనే కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనపైనా పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం.. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది.

#konda sureka#revanth reddy#congress#Go release#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి