ప్రస్తుత సమాజంలో మానవ విలువలు అంతరించిపోతున్నాయి. మనిషి నిండు ప్రాణం కంటే ఆస్తిపాస్తులకే విలువనిస్తున్నారు కొందరు. డబ్బులుంటే చాలు. బంధాలు, బంధుత్వాలు వాటంతట అవే దగ్గరికి వస్తాయనే భ్రమలో కొందరు బతికేస్తున్నారు.ఆస్తిలో వాటా కోసం ప్రాణాలు తీయడానికైనా వెనుకాడటం లేదు. ఆస్తి,అంతస్తుల హోదా ముందు రక్త సంబంధాలు కూడా ఒడిపోతున్నాయి. తాజా ఘటన ఇందుకు అద్దం పడుతోంది.
ఆస్తిలో తన అక్కకు ఎక్కడ వాటా రాకుండా పోతుందో అని సొంత బావను..బావమరిది సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కోటి వీరనాగయ్య అనే వ్యక్తికి వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆయన వ్యాపారం చేస్తుంటాడు. అయితే, వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్త ఆయన భార్య, బావమరిదికి తెలిసింది.
పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వీరనాగయ్యను హెచ్చరించారు. అయినా, ఆయన బుద్ధి మారలేదు. కట్టుకున్న భార్య, పిల్లల కంటే పరాయి మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టాడు. అయితే, బావ పేరిట ఉన్న ఆస్తి తన అక్క, పిల్లలకు ఎక్కడా దక్కకుండా పోతుందోనని భావించిన బావమరిది రాజేశ్.. బావ వీర నాగయ్య హత్యకు కుట్ర పన్నాడు. ఇందుకోసం రూ.4 లక్షలకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్లాన్లో భాగంగా సోమసుందరపాలెం వద్ద బావను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు రాజేశ్. ఆపై మృతుడి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాలని నిందితులకు చెప్పాడు. దీనిని దోపిడీ హత్య కింద చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. అయితే, వీరనాగయ్య కనిపించకుండా పోయాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు వీరనాగయ్య హత్యకు గురైనట్టు తెలిసింది.విచారణలో భాగంగా బావమరిదే చంపించాడని పోలీసులు తేల్చారు.ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు పోలీసులు తెలిపారు.
https://x.com/pulsenewsbreak/status/2095680997152997663?s=20








