భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరొక సంచలనాత్మక విజయం నమోదైంది.. అంతరిక్షంలో జీఎస్ఎల్వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన అత్యాధునిక 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్' (EOS-09)ను మన శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్ఎల్వీ సిరీస్లో ఇది ఇస్రోకు 17వ విజయవంతమైన మైలురాయి కావడం విశేషం.
భారతదేశ రక్షణ వ్యవస్థకు కక్ష్యలోకి చేరిన EOS-05 ఉపగ్రహం అత్యంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా దేశ సరిహద్దుల పర్యవేక్షణలో ఈ శాటిలైట్ ఓ డేగకన్నులా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే సరిహద్దు వెంబడి జరిగే మార్పులను పసిగట్టడంతో పాటు, శత్రు దేశాల కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ మన భద్రతా దళాలకు విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు.
ఈ ఉపగ్రహం వల్ల దేశ భద్రత మరింత పటిష్టం కానున్నట్టు వారు పేర్కొన్నారు. మరోవైపు ఈ EOS-05 ఉపగ్రహం కేవలం రక్షణ రంగంలోనే కాకుండా వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణలోనూ ఇది అద్భుతాలు సృష్టించబోతోంది. తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి క్షణాల వ్యవధిలోనే హెచ్చరికలు జారీ చేసే అత్యున్నత సాంకేతికత దీని సొంతం. దీనివల్ల వేలాదిమంది ప్రాణాలను, వేల కోట్ల ఆస్తి నష్టాన్ని నివారించడం సాధ్యమవుతుంది.
మన ఇస్రో పరిమిత వనరులతోనే ప్రపంచం ఆశ్చర్యపోయేలా సరికొత్త ప్రయోగాలు చేస్తూ, భారత్ను అంతరిక్ష సూపర్ పవర్గా నిలబెడుతోంది. ఈ క్రమంలో నిరంతరం దేశం కోసం శ్రమిస్తూ, విశ్వంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..








