Aadarsha Kutumbam Teaser: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి వెంకీ సరసన హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. తాజాగా, ఈ సినిమా నుంచి అందరూ ఎదురుచూస్తున్న టీజర్ రిలీజైంది.
ఇక, ఈ సినిమాలో నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తుండగా..మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆదర్శ కుటుంబం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ వదిలారు.
త్రివిక్రమ్ మార్క్ పంచులతో టీజర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇందులో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో నటించాడు. అతనొక మధ్యతరగతి వ్యక్తి. దొరికినచోటల్లా అప్పులు చేసే భార్య.. చదువు అబ్బని కొడుకు.. ఈ క్రమంలో అప్పులను, కుటుంబాన్ని భరిస్తూ ఉద్యోగం చేసే చిట్టిబాబుకు ఊహించని విధంగా లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడువుతాడు. ఆ తర్వాత ఈ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏంటి..? చిట్టిబాబుకు ఎదురైన సమస్యలు ఏంటి..? అనేది సినిమా కథ అని టీజర్తో అర్థమవుతోంది.
ఇక, తాజాగా వదిలిన టీజర్ లో వెంకటేష్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. 'నాకు "ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు.. కానీ, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనుకాడను', 'నదికట్టు దాటితే వరదంటారు.. సముద్రం దాటితే ఉప్పెనంటారు.. కానీ, సామాన్యుడు హద్దు దాటితే బలమైన పదం.. స్ట్రాంగ్ సౌండ్ వస్తుంది' అనే డైలాగ్స్ త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ ని గుర్తుచేస్తున్నాయి. మొత్తానికి, ఆదర్శ కుటుంబం సినిమాతో త్రివిక్రమ్ తో పాటు, వెంకీ-శ్రీనిధి శెట్టిల ఖాతాలోనూ బ్లాక్ బస్టర్ చేరడం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే అక్టోబర్ 2వరకూ ఆగాల్సిందే.







