Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న..ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్గా మారింది. ఇక, అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప ఫ్రాంఛైజీస్తో పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకుంది. అప్పటి నుంచి రష్మికకి పాన్ ఇండియా ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ఇలా క్రేజీ మూవీస్తో వరుస విజయాలను అందుకుంటున్న నేషనల్ క్రష్..అరుదైన ఘనతను సాధించింది.
ఇప్పటికే..రష్మిక తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో భారీ చిత్రాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన నటిగానూ రష్మిక సత్తా చాటుకుంది. పాపులర్ నేషనల్ మీడియా ఆర్గనైజేషన్ ‘ఇండియా టుడే’ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో రష్మిక ఈసారి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

ఈ సర్వేలో నాలుగేళ్ల నుంచి అగ్రస్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొనసాగింది. ఇప్పుడు, ఆమెని రష్మిక మందన్న వెనక్కి నెట్టడం అటు బాలీవుడ్ లో ఇటి టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో రష్మికకు ఆధరణ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ ఫలితంతో అర్థమైంది. కేవలం కన్నడ భాషకో, తెలుగు భాషకో పరిమితమైన హీరోయిన్గా కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో తన మార్కెట్ను పెంచుకుంటూ వరుస భారీ చిత్రాల్లో నటిస్తున్న రష్మికకు ఈ గుర్తింపు దక్కడం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.
మూడు చిత్రాలతో బిజీ బిజీ:
ప్రస్తుతం రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే, మూడు భారీ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. వాటిలో ఒకటి తన భర్త విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్కి రెడీ అవుతోంది. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో రాకా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరవబోతోంది. వీటితో పాటు మరో పాన్ ఇండియా సినిమా మైసాలోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది.







