తెలంగాణ

Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?

రచన: NK6 నిమిషాల పఠనం

Konda Surekha: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖపై వేటు ఖాయమనే ప్రచారం జోరుగా నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కొండా సురేఖ ఫొటో కనిపించలేదు. అంతేకాదు శిలాఫలకాల్లోనూ మంత్రి పేరుని అధికారులు చేర్చలేదు. దీంతో అనుమానాలు పెరిగాయి.

Konda Surekha: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖపై వేటు ఖాయమనే ప్రచారం జోరుగా నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కొండా సురేఖ ఫొటో కనిపించలేదు. అంతేకాదు శిలాఫలకాల్లోనూ మంత్రి పేరుని అధికారులు చేర్చలేదు. దీంతో అనుమానాలు పెరిగాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలకాల్లో కొండా సురేఖ ఫొటో కానీ పేరు కానీ లేకపోవడం దేనికి సంకేతం అనే డిస్కషన్ జరుగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క పర్యటిస్తున్నారు. మంత్రుల అధికారిక ప్రకటనకు సంబంధించి అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో మంత్రి కొండా సురేఖ ఫొటోను అధికారులు పెట్టకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటిస్తున్నారు. 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు శంకుస్థాపన శిలాఫలకాలపైనా కొండా సురేఖ పేరు కనిపించలేదు. గూడూరు ఘటన మరువక ముందే కే సముద్రంలోనూ అదే పరిస్థితి దర్శనమిచ్చింది. కొండా సురేఖ ఫొటో లేకపోవడంపై రాజకీయవర్గాల్లో దుమారం రేపడంతో పాటు చర్చకు దారితీసింది.

కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, మంత్రి కొండా సురేఖకు మధ్య అంతరం పెరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది. కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన వేళ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలోనూ కొండా సురేఖ ఫొటో లేకపోవడంపై కొండా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వివాదం తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావన ఉండటం లేదు. అధికార పార్టీలో రోజురోజుకు మారుతున్న సమీకరణాలకు ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. ఆగస్ట్ 25న వరంగల్ జిల్లా కేంద్రంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హాజరుకాలేదు.

ఇక స్మార్ట్ కార్డుల పంపిణీ, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే, ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కొండా సురేఖ ఫొటో లేదు. ఆమె ప్రస్తావ లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటిస్తున్నారు. కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలే. దీంతో అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అయితే, ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా కొండా సురేఖ ఫొటో లేదు.

#Konda Surekha#Konda Surekha Photo Missing#Konda Surekha Name Missing#Warangal District#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి